Off The Record: ఆదిలాబాద్ రైల్ బ్రిడ్జిల నిర్మాణం చుట్టూ రాజకీయం
- ఆదిలాబాద్ రైల్ బ్రిడ్జిల నిర్మాణం చుట్టూ రాజకీయం
- మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ గేమ్ ఆడుతోందంటున్న బీఆర్ఎస్
- 2023 మే4న ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలకు భూమి పూజ
- అప్పట్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- తాజాగా బీజేపీ ఎంపీ, అదే పార్టీ ఎమ్మెల్యే కలిసి మళ్ళీ భూమి పూజ
- గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా నిర్మాణాలు
- ఇప్పుడు వంద శాతం నిధులు కేంద్రానివే, అందుకే మళ్ళీ అంటున్న బీజేపీ
- సగంలో ఆగిన వాటిని భూమి పూజ ఏంటన్న ప్రశ్నలు
- రెండు పార్టీల మధ్య జోరుగా సోషల్ మీడియా యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆదిలాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్ స్టంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రైల్ వోవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జిలకు తాజాగా శంకుస్థాపనలు జరగడమే అందుకు కారణం. మూడేళ్ళ క్రితం మేం భూమి పూజ చేసిన వాటికి ఇప్పుడు బీజేపీ నాయకులు మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారంటూ… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు గూలాబీ నాయకులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్నది బీఆర్ఎస్ మాట.
Also Read
ఆదిలాబాద్ టౌన్లోని ఎల్ఐసీ ఆఫీస్, ఆర్టీఓ కార్యాలయం ఏరియాతోపాటు తాంసి బస్టాండ్, పత్తి మార్కెట్కు వెళ్ళే దారిలో రైల్వే గేట్లు నిత్య నరకం చూపిస్తున్నాయి. గేటు పడితే ట్రాఫిక్ జాంతో పట్టణ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలకు చెక్ పెట్టే క్రమంలో… రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ,అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి 2023 మే4న భూమి పూజ చేశారు. నాటి బీజేపీ ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న కలిసి ఎల్ ఐసీ ఆఫీస్ ఏరియాలో ఆర్ ఓబీ, ఆర్ యూబీ పనుల శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 97 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. సంజయ్ నగర్లోని ఓవర్ బ్రిడ్జి, తాంసి బస్టాండ్ ఏరియాలోని అండర్ బ్రిడ్జి నిర్మాణాలను 2024 కల్లా పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఓవర్ బ్రిడ్జి పనులు ఇప్పటికీ కొనసాగుతుండగా…. అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ అడ్డుగా మారింది.
ఈ పరిస్థితుల్లో….తాజాగా బీజేపీ ఎంపీ నగేష్, అదే పార్టీ ఎమ్మెల్యే శంకర్ కలిసి తాంసి బస్టాండ్ ఏరియాలో భూమి పూజ చేశారు. దాంతో పొలిటికల్ కలర్ వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం జనాన్ని పక్కదారి పట్టించే విధంగా గిమ్మిక్కులు చేస్తున్నారంటూ గతంలోని వీడియోలను వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అదే సమయంలో బీజేపీ వెర్షన్ వేరుగా ఉంది. గులాబీ నేతలు అనవరంగా ఆరోపణలు చేస్తున్నారని, నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కాగా.. ఇప్పుడు మొత్తం నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, అలాంటప్పుడు మేం భూమిపూజ చేస్తే తప్పేంటన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు రాష్ట్రం వాటా నయా పైసా లేదని, వంద శాతం ఫండింగ్ కేంద్రమే చేస్తున్నప్పుడు ఆ మాత్రం క్రెడిట్ తీసుకోకూడదా అన్నది కమలం నాయకుల క్వశ్చన్.
ఇదిలా ఉండగానే తాజాగా భూమి పూజ సమయంలో ఏర్పాటు చేసిన సభా వేధికపైనే ఎంపీ నగేష్ మాట్లాడుతూ తాను వేరే పార్టీలో ఉన్నప్పుడు 2016-17 బడ్జెట్ లోనే ఆదిలాబాద్ రైల్వే ఓవర్ ,అండర్ బ్రిడ్జిలకు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. అంటే ఎప్పుడో బడ్జెట్ కేటాయించారు…నిధులు మంజూరు అయ్యాయి..2023 మే నెలలో నాటి ఎంపీ,ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఓవర్ బ్రిడ్జి పనులు సగం వరకు అయిపోయాయి. అలాంటప్పుడు మళ్లీ భూమి పూజ చేయడం ఎందుకనే ప్రశ్న ఆయన స్పీచ్ నుంచే వస్తోంది. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియా యుద్ధం గురించి అయితే చెప్పే పనేలేదు. మొత్తం మీద ఆదిలాబాద్ రైల్వే అండర్, వోవర్ బ్రిడ్జిల చుట్టూ… కావాల్సినంత రాజకీయం నడుస్తోంది. మీకు మరీ… అంతగా కొబ్బరి కాయలు కొట్టాలని ఉంటే… ఏ గుళ్ళోకో వెళ్ళి కొట్టుకోండి. పుణ్యమన్నా వస్తుంది. లేదా జనానికి ఉపయోగపడే ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చి కావాల్సినన్న కొట్టుకోండిగానీ… ఇలా… చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్టు ఈ కోకోనట్ కొట్టుడు ప్రోగ్రామ్ ఏంటయ్యా బాబూ… అంటూ సెటైర్స్ వేస్తున్నారు స్థానికులు.
READ ALSO: BCCI vs BCB: BCCI తో గొడవ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంప ముంచబోతుందా?
తాజావార్తలు
-
TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
-
Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
-
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
-
Tesla Model Y: టెస్లా మోడల్ Y ఇప్పుడు గ్రోక్ AI ఫీచర్తో.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో మాట్లాడే AI అసిస్టెంట్
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!