భూ వివాదాల్లో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతల ల్యాండ్ పంచాయితీలు శ్రుతి మించుతున్నాయి. గుడిహత్నూర్.. ఇచ్చోడ మధ్య ఉన్న భూమి విషయంలో కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ ల్యాండ్ పంచాయితీ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ ఇంటికి చేరడంతో.. సమస్యపై మాట్లాడేందుకు కొందరు పార్టీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఒకానొక సమయంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్రెడ్డి ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లారని ఎంపీ గన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయింది.
తాజా గొడవపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆ రాత్రి ఎంపీ ఇంటికి పంచాయితీకి వెళ్లిన అందరిపై కాకుండా.. కొందరిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే కాదు… కొద్ది రోజులుగా ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలు సీరియస్గా ఉన్నారట. కొందరు నేతల తీరుపై ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
భూ తగాదాల్లో ఎవరు తలదూరుస్తున్నారు? ఏ నేత బంధువులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు అనేది బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. ఇచ్చోడ భూ వివాదాల్లో మాత్రం.. పార్టీ నేతల తీరుపై ఎంపీ బాపూరావ్ సీరియస్గా తీసుకున్నారట. ఏం జరిగిందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆయన వెల్లడించారట. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్పై ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. ఆ తర్వాతే పాయల్ శంకర్ ఎంపీని శరణు కోరడంతో కొందరిపైనే కేసులు నమోదైనట్టు చెవులు కొరుక్కుంటున్నారట. అయితే ఈ వ్యవహారంలో ఎంపీ పాత్రను కొందరు పార్టీ నేతలు అనుమానిస్తున్నారట. ఆయన మాత్రం కేసుల విషయంలో తన ప్రమేయం లేదని చెబుతున్నారట.
మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతలపై కేసులు.. భూ వివాదాలపై రకరకాలుగా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. పార్టీ నుంచి బయటకు సాగనంపేందుకు ఎవరికో పొగ పెడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ రగడను పార్టీ పెద్దలు పరిష్కరిస్తారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!