అనంతపురం టీడీపీ వర్గాల్లో ఫన్నీగా మారిన లేఖ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏ గొడవ జరిగినా.. అధిష్ఠానం పేరుతో ఒక లెటర్ వస్తుంది. అందులో ఊరు పేరు.. మ్యాటర్ ఉంటుంది. ఎందుకు పంపిస్తున్నారు.. ఎవరికి పంపిస్తున్నారో వివరాలు కనిపించవు. కానీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంతకీ ఆ లేఖల ఆంతర్యం ఏంటి?
ఇప్పటికే అనంతలో జేసీ వర్సెస్ టీడీపీ పాత నేతలు..!
Also Read
అనంతపురం జిల్లా టీడీపీలో కొన్నిరోజులుగా వర్గ విబేధాలు ఒక రేంజ్లో సాగుతున్నాయి. గతంలో నియోజకవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉండేది. ఇప్పుడు ఏకంగా ఒకరి నియోజకవర్గాలకు ఒకరు వెళ్లి సవాళ్లు చేసుకునేంత వరకు సమస్య వెళ్లింది. ఆ మధ్య అనంతపురంలో జరిగిన సీమ టీడీపీ నేతల సదస్సులో ఈ విభేదాలకు బీజం పడింది. కృష్ణజలాల పరిరక్షణ కోసం చేపట్టిన సదస్సులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి రచ్చ రేపారు. ఒకరిద్దరు నేతలు పార్టీని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు JC. మరుసటి రోజు పాత టీడీపీ నేతలంతా ఒక్కటై జేసీని మాటలతో ఉతికి ఆరేశారు.
అచ్చెన్నాయుడు పేరుతో లేఖ వైరల్..!
టీడీపీ నేతలకు కౌంటర్ ఇవ్వకుండా అనంతపురం, పుట్టపర్తి తదితర నియోజకవర్గాలకు వెళ్లి టీడీపీ నేతలను పరామర్శించారు జేసీ ప్రభాకర్రెడ్డి. తమ నియోజకవర్గాల్లో జేసీ జోక్యం చేసుకుంటున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ గొడవ పీక్కి చేరిన సమయంలో ఒక లేఖ వైరలైంది. తమ నియోజకవర్గాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పార్టీ అనుమతి తీసుకోవాలని అచ్చెన్నాయుడు పేరుతో ఆ లేఖ వచ్చింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే తమ దృష్టికి రావాలని కూడా అందులో ఉంది.
గొడవకు కారణం తెలిసినా అధిష్ఠానం వాటి జోలికి వెళ్లదా?
అసలే సీమ నేతలు. వారిని లేఖలు ఆపుతాయని అనుకోవడం భ్రమే. కాకపోతే ఎవరు ఎక్కడికి వెళ్లినా వెంటనే అచ్చెన్నాయుడు పేరుతో ఉన్న లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. జేసీ పర్యటనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తాడిపత్రి వెళ్లారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కడ పర్యటిస్తున్నారు? ఎందుకెళ్తున్నారు? గొడవకు కారణం ఎవరో తెలిసినా టీడీపీ అధిష్ఠానం వాటి జోలికి వెళ్లదు.
చేయి దాటిపోతుందని అనుకుంటున్న సమయంలో మాత్రం ఒక లేఖ పంపి చేతులు దులిపేసుకుంటున్నారట. ఏదీ నేరుగా చెప్పరు. అంతా డొంకతిరుగుడు వ్యవహారమే. దీనిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.
టీడీపీ వర్గాల్లో ఫన్నీగా మారిన లేఖ..!
మొదట్లో ఇలాంటి లేఖలను పార్టీలో అందరూ సీరియస్గా తీసుకునే వారు. కానీ సమస్య ఏదైనా ఒకే తరహా లేఖ సర్క్యులేట్ అవుతుండటంతో ఫన్నీగా మారిపోయింది. దాంతో లేఖను లైట్ తీసుకుంటున్నారట నాయకులు. ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో.. ఎవరిని బుజ్జగించాలో తెలియకుండా గాలిలో బాణాలు వేస్తే లాభం ఏంటన్నది కొందరి ప్రశ్న. ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నాయకులు.. అధిష్ఠానం నాన్చివేత ధోరణిని ఎవరికి అనుకూలంగా వారు మలుచుకుంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!