MP Vijayasai Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సమస్య లేదని, బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందన్నారు. మూడు లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశాం.. త్వరలో మరో లిస్ట్ ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత పరస్పర ఆరోపణలు సహజమని, ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మా నాయకుడ్ని టీడీపీ నేతలు విమర్శిస్తే తిప్పికొట్టడం మా బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతను ప్రతీ ఒక్కరూ నిర్వర్తించాలన్నారు.
Read Also: Jogi Ramesh: పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను సిద్ధం..
అంతే తప్ప తిట్టడం అనే పదాన్ని వాడకూడదన్నారు. కావాలనే టీడీపీ వాళ్లు తిట్టమన్నారని ఎందుకు ఆరోపణలు వారే చెప్పాలని, తిట్టమని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. మేము అలా చెప్పమన్నారు. మా నేతను విమర్శిస్తే మేమే సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ మరణంపై గతంలోనే విచారణ జరిగింది.. రిపోర్టును అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎలా గెలిచారో అన్నీ రుజువులు అప్పగించామన్నారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.