Jogi Ramesh: పెనమలూరు నుంచి పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను పోటీకి సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. జగన్ ఏం చెబితే అది చేయడానికి సైనికుడిగా పనిచేస్తానన్నారు. పెడనలో నా సిట్టింగ్ స్థానం వేరే వారికి ఇచ్చినా గెలుపుకి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి..! గుంటూరు కారం థియేటర్లో బాలినేని..
2009లో వైయస్ నన్ను పెడన నుంచి పోటీ చేయిస్తే.. 2014లో నన్ను మైలవరం నుంచి జగన్ పోటీ చేయించారని, ఓడిపోయానని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇప్పుడు తనను పోటీ చేయమని జగన్ పెనమలూరు పంపారని.. పెనమలూరులో వెళ్లి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేశినేని నాని బెజవాడ ఎంపీగా వైసీపీ నుంచి గెలుస్తారని ఆయన చెప్పారు. టీడీపీలో ఉన్నపుడు జగన్ను తిట్టక తప్పదు కాబట్టి కేశినేని నాని అలా మాట్లాడి ఉండవచ్చని మంత్రి జోగి రమేష్ తెలిపారు.