YSRCP MP Vijayasai Reddy: ఏపీలో ఓట్ల గందరగోళంపై ఫిర్యాదు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MP Vijayasai Reddy: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎన్నికల అధికారికి ఏపీలో ఓట్ల గందరగోళంపై పిర్యాదు చేశామని ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. మొత్తం 5 అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు.
Read Also: Chandrababu: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం కలిగింది..
Also Read
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
టీడీపీ నేతలు కొన్ని వెబ్సైట్ల ద్వారా ఓటర్ల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా సేకరిస్తున్నారని.. తప్పుడు ఫిర్యాదులు చేసి ప్రభుత్వానికి భంగం కలిగిస్తున్నారని ఆయన అన్నారు. Tdp My party dash board. Com పేరుతో ఓటర్ల అన్ని వివరాలు నమోదు చేశారని, మొబైల్ నంబర్ కూడా చేర్చారని.. గతంలో సేవా మిత్ర పేరుతో డేటా కలెక్ట్ చేశారని ఆయన వెల్లడించారు. 2019లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని.. కానీ కేసులో పురోగతి లేదన్నారు. వివరాల సేకరణలో కులం పేరు కూడా అడుగుతున్నారని.. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని.. ప్రతి 30 ఇళ్ళల్లోని ఓటర్లకు ఒక ఏజెంట్ను పెట్టి డేటా కలెక్ట్ చేస్తున్నారన్నారు. లండన్లో ఉన్నటువంటి సర్వర్లో పొందుపర్చారని.. ఓటర్ల నుంచి సమాచారం సేకరించడం చట్టవిరుద్ధమన్నారు.
Tdp babu surity పేరుతో భవిష్యత్ సురిటి కార్డ్ పేరుతో డేటాను కలెక్ట్ చేశారని ఆయన చెప్పారు. ముందే ప్రామిస్లు చేస్తున్నారని.. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న ఓటర్లను మళ్ళీ ఇక్కడ రిజిష్టర్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఓటర్లను ఏపీలో ఎన్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఒక డ్రైవ్ చేస్తోందని.. ఒక కులానికి, వర్గానికి చెందిన వాళ్ళను ఏపీలో ఎంటర్ చేస్తున్నారన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో ఎన్రోల్ చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
-
JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
-
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
-
Sukumar: డైరెక్టర్ సుకుమార్ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
-
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!