Perni Nani: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. ల్యాబ్లో గుర్తించిన ఆవు నెయ్యి ట్యాంకర్లను వెన్నక్కి తిప్పి పంపామని ఈఓ శ్యామల రావు చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రసాదంపై చేస్తున్న అసత్య ప్రచారానికి పవన్ కూడా జత కలిశారన్నారు. దున్నపోతు ఈనిందంటే అన్న సామెత మాదిరి పవన్ తీరు ఉందన్నారు.కూటమి చేసిన ఈ అపవిత్ర ప్రచారం నేపథ్యంలో వచ్చే శనివారం ఆలయాల్లో పూజలు చేయటం ద్వారా పరిహారం చేయాలని నిర్ణయించామన్నారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిస్తోందన్నారు.
Read Also: Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు