Perni Nani: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..
- తిరుమల పవిత్రతను రాజకీయాలకు వాడుకుంటున్నారు
- ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు
- మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. ల్యాబ్లో గుర్తించిన ఆవు నెయ్యి ట్యాంకర్లను వెన్నక్కి తిప్పి పంపామని ఈఓ శ్యామల రావు చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రసాదంపై చేస్తున్న అసత్య ప్రచారానికి పవన్ కూడా జత కలిశారన్నారు. దున్నపోతు ఈనిందంటే అన్న సామెత మాదిరి పవన్ తీరు ఉందన్నారు.కూటమి చేసిన ఈ అపవిత్ర ప్రచారం నేపథ్యంలో వచ్చే శనివారం ఆలయాల్లో పూజలు చేయటం ద్వారా పరిహారం చేయాలని నిర్ణయించామన్నారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిస్తోందన్నారు.
Read Also: Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వారు చేస్తారని.. తెలిసి తెలియక తప్పులు చేసిన వారు ఈ దీక్ష చేస్తారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటేనన్నారు. చంద్రబాబు కుళ్లిన మెదడుతో తిరుమల ప్రసాదంపై మలినపు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తిరుమల ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ పాపం దహించుకుపోవటంతో పవన్ ఈ దీక్ష చేస్తున్నారన్నారు. పవన్ హిందువు అని చెబుతున్నారా ?.. భీమవరంలో బాప్టిజం తీసుకున్నాను అని పవన్ చెప్పారు కదా అంటూ వ్యాఖ్యానించారు. జనం ఏ విషయం మర్చిపోరు అనే విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారు అనుకుంటా అంటూ ఆయన అన్నారు.హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి 400కి అమ్ముతున్నారన్నారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!