YSRCP Kapu Leaders Meeting: రాజమండ్రిలో కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ,గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరంతా రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో భేటీ అయి పలు అంశాల గురించి చర్చిస్తున్నారు.
Read Also: Vishal-Abhinaya: విశాల్తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన అభినయ
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
కాపులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు రాజమండ్రిలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు ఇకపై ఏం చెయ్యాలని ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని కాపు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్పటికే దిశా నిర్దేశం చేశారు. కాపు నేతల భేటీ అనంతరం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహిస్తారు.వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధులు సమావేశం పెట్టుకుంటే పవన్ కళ్యాణ్కు కంగారెందుకని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Read Also: Bhakthi Tv Kotideepotsavam 2022: భక్తి టీవీ కోటిదీపోత్సవం.. ఆధ్యాత్మిక సంరంభం… ఈరోజే ప్రారంభం
ఇదిలా వుంటే.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఓ లేఖను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఏపీలో రాజ్యాధికారం కోసం 22 శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి ఓ అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ముందుకు వెళుతున్నారు. వైసీపీ అధినేత జగన్కు అండగా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉంటూ పవన్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని కొందరు చేసిన విమర్శలకు ధీటుగా పవన్ చెప్పును చూపించాడాన్ని కాపు సంక్షేమ సేన సమర్దిస్తోంది.
2024 ఎన్నికలలో కాపులు, బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేయటానికి సిద్ధం కావాలి.’’ అని హరిరామ జోగయ్య కోరారు. రాబోయే ఎన్నికల్లోనూ జనసేనకు సీట్లు రాకుండా చేయాలని, కాపు ఓట్లు జనసేనకు పడకుండా పకడ్బందీ వ్యూహం పన్నుతోంది వైసీపీ. జనసేన మాత్రం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని, రాబోయే ఎన్నికలకు తగిన ప్రణాళికతో ముందుకు వెళతామంటున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!