YSRCP Action Plan: వైఎస్సార్సీపీ పటిష్టతపై జగన్ ఫోకస్.. నేతలకు స్వీట్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, సమావేశం సందర్భంగా నాయకులకు సీఎం జగన్ మెత్తటి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాధ్యత తీసుకుంటే కచ్చితంగా పని చేయాలి. పని చేయలేక పోతే ముందే చెప్పేయండి. మీరు పని చేస్తున్నారో లేదో పర్యవేక్షించటానికి నా మనుషులు ఉంటారు. మీరు పని చేయకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.పని చేసిన వాళ్ళకు తగిన గుర్తింపు ఉంటుంది. అబ్జర్వర్లకు వారి విధుల పై సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. పరిశీలకులతో సీఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. అబ్జర్వర్లు మీకు కేటాయించిన నియోజకవర్గాలను గెలిపించుకుని తీసుకుని రండి. మరో పవర్ సెంటర్ గా మారే ప్రయత్నం చేయకండి. ఐదో తరగతి పిల్లవాడిని 10వ తరగతి క్లాస్ లో కూర్చో బెట్టినట్లే కొద్ది రోజులు మీకు ఇబ్బంది ఉంటుంది. నెమ్మదిగా అలవాటు పడతారు. మీరు గెలిపించుకుని వస్తే మిమ్మల్ని ఎలా చూసుకోవాలి అన్న బాధ్యత నాది అన్నారు జగన్.
Read Also: Perni Nani: పవన్ వారాహి వాహనంపై సెటైర్లు.. పసుపు రంగేయండి
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
మరో ఏడాదిన్నరలో ఎన్నికల యుద్ధం మొదలు కాబోతోంది. ఈనేపథ్యంలో నియోజవకర్గాల్లో చురుగ్గా పార్టీ కార్యక్రమాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో బలోపేతం కానుంది వైయస్సార్సీపీ సైన్యం. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహసారథులు వుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.20 లక్షల మంది నియామకం కోసం కసరత్తు చేస్తోంది పార్టీ అధిష్టానం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లు వుంటారు. ఇందులో తప్పనిసరిగా మహిళ వుంటుంది. మొత్తంగా 45 వేల మంది కన్వీనర్ల నియామకం జరగనుంది.
డిసెంబరు 20 కల్లా గ్రామ, వార్డు సచివాలయాల్లో పార్టీ కన్వీనర్ల నియామకం పూర్తవుతుంది. తర్వాత 10-15 రోజులపాటు ఇంటింటికీ పార్టీ సచివాలయ కన్వీనర్లు వుంటారు. ఆతర్వాత గృహసారథుల నియామకం జరుగుతుంది. రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గాల పరిశీలకులకు కార్యక్రమాన్ని నిర్దేశించారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్ల, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో సీఎం సమావేశం నిర్వహించారని తెలిపారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. బూత్ కమిటీలకు కొత్త రూపం ఇస్తామన్నారు. గతంలో గ్రామాన్ని యూనిట్ గా తీసుకునే వారు. కానీ ఇప్పుడు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకుని వ్యవస్థ ఏర్పాటు చేశారు. మరింత సూక్ష్మ స్థాయికి వెళ్ళినట్లు అవుతుందన్నారు.

మాజీ మంత్రి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి పార్టీ వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీని కళ్ళు, చెవులుగా పరిశీలకులు వ్యవహరిస్తారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి. రాష్ట్రాలు విడిపోయి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవటం సాధ్యమవుతుందా… అరుణ్ కుమార్ వ్యాఖ్యలు. ఆచరణ సాధ్యం అవుతాయా? టీఆర్ఎస్ నాయకులు ఆకలి మీద ఉన్నారన్నారు. త్వరలో ఎమ్మెల్యేలతోనూ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. 10 రోజుల్లో బూత్ కమిటీల ఏర్పాటు పూర్తవుతుందన్నారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!