YS Sharmila: నేడు జగన్ ఇంటికి షర్మిల.. ఆ తర్వాత ఢిల్లీకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట ఈ రోజు ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి.. కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్న షర్మిల.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవనున్నారు.. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్కు అందజేయనున్నారు.. తన ఇంట్లో జరిగే తొలి శుభకార్యానికి హాజరుకావాలని అన్నకు ఆహ్వానం పలకనున్నారు.. అయితే, గత కొన్నేళ్లుగా అన్నా – చెల్లెళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందనే వార్తలు వచ్చాయి.. చివరకు వైఎస్ ఘాట్లో నివాళులర్పించే సమయంలోనూ ఇద్దరు విడివిడిగా వెళ్లడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.. ఇప్పుడు షర్మిల.. తన అన్నయ్య దగ్గరకు వెళ్తుండడంతో.. ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నారు ప్రజలు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మరోవైపు.. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్తో సమావేశం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమై.. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.. అయితే, కాంగ్రెస్లో చేరేముందు వైఎస్ జగన్ను కలవనుండడం కూడా చర్చగా మారింది.. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న వైఎస్ షర్మిల.. కడప నుంచి ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి చేరుకుంటారు.. మరోవైపు.. తన కాకినాడ పర్యటనను ముగించుకుని మధ్యాహ్నం తర్వాత నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్.. ఆ తర్వాత అన్నను కలిసి ఆహ్వానం అందించి ఢిల్లీ బాట పట్టనున్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అగ్రనేతలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. తన వెంట వచ్చే నేతల వివరాలు.. తనకు బాధ్యతలు అప్పగిస్తే తాను నిర్వహించే కార్యక్రమాలు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం.. తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపిన షర్మిలకు ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే పార్టీ విలీనానికి సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తు్నారు. ఇక, ఏపీ కాంగ్రెస్ లో ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది.. మరోవైపు.. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించిన షర్మిల.. ఢిల్లీలో ఏం మాట్లాడనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!