YS Jagan: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత!
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన
- కారు ఢీకొని వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి
- వైసీపీ పార్టీ తరఫున 10 లక్షల ఆర్థిక సాయం అందజేత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద కారు ఢీకొని మృతి చెందిన వెంగళాయపాలెంకు చెందిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమాలు పరామర్శించారు. అనంతరం వైసీపీ పార్టీ తరఫున 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సింగయ్యను ఢీకొట్టిన వాహనం వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు గొట్టిపాటి హరీష్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ‘సింగయ్య వైసీపీ కార్యకర్త, వైఎస్ జగన్ అభిమాని. జగన్ పర్యటనలో కారు యాక్సిడెంట్తో సింగయ్య మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలిసిన వెంటనే జగన్ ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతిని కూడా ప్రభుత్వం రాజకీయం చెయ్యాలని చూసింది. జగన్ పర్యటనపై వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు, వాటిపై న్యాయపోరాటం చేస్తాం. వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. జగన్ పర్యటనకు ప్రజలను రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం, పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు’ అని అన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Also Read: MLC Naga Babu: జనం గట్టిగా బుద్ధి చెప్పారు.. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు!
‘సింగయ్య వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్త. యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది’ అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!