MLC Naga Babu: జనం గట్టిగా బుద్ధి చెప్పారు.. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు!
- రాష్ట్రంలో తాజా పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ నాగబాబు
- వైసీపీ దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉంది
- హంతకులకు వంత పాడడం దేనికి నిదర్శనం
వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. గత ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని నాగబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రియాక్ట్ అయ్యారు. ‘రుణ భారంతో అప్పజెప్పిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలకై ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి హంతకులకు వంత పాడడం, పోలీస్ వ్యవస్థను బెదిరించడం దేనికి నిదర్శనం. సమస్యలు, సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. ప్రతిస్పందించే యంత్రాంగం అందుబాటులో ఉంది’ అని నాగబాబు అన్నారు.
Also Read
- Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
- Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
Also Read: Mayor Suresh Babu: కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ.. నా ఇష్టం అంటున్న మేయర్!
‘గత ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. మొదటి ఏడాదిలోనే సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలనలతో ప్రజల్లో విశ్వాసం కలిగించింది. ముగ్గురు కలిసి మరింత అభివృద్ధి చేస్తారు’ అని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- janasena
- MLC Naga Babu
- Naga Babu
- tdp
- ycp
తాజావార్తలు
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
-
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!