YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. హైకోర్టుకు మరోసారి ఎంపీ అవినాష్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు.. ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ కు అనుమతించాలని అవినాష్రెడ్డి లాయర్ అభ్యర్థించారు.. అయితే, హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం పేర్కొంది.. మధ్యాహ్నం 2.30 గంటలకు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు అనుమతించే అవకాశం ఉంది.. అయితే, హైకోర్టులో పిటిషన్ విచారణ పెండింగ్లో ఉండగా.. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని.. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు సీబీఐ పిలిచిందని భాస్కర్ రెడ్డి తరపు లాయర్ పేర్కొన్నారు.
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కరరెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేసిన సీబీఐ ఆయన్ను హైదరాబాద్ తరలించింది. ఉస్మానియాలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ జడ్జి నివాసంలో హాజరుపరిచారు. సీబీఐ అరెస్ట్ అక్రమమని భాస్కరరెడ్డి లాయర్లు వాదించారు. అయితే ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తని, బయటఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి… భాస్కరరెడ్డికి 14రోజుల రిమాండ్ విధించారు. ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తున్నారు భాస్కరరెడ్డి లాయర్లు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
మరోవైపు, వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా మార్చడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై, ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇదే కేసులో అరెస్టయిన ఉదయ్కుమార్రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారించనుంది సీబీఐ. ఇక, వైఎస్ వివేకా మర్డర్ కేసులో తన తప్పు లేదన్నారు అవినాష్రెడ్డి. కోర్టులపై నమ్మకం ఉందని చెప్పారు. కట్టుకథలతో జరిగే దర్యాప్తు నిలబడవన్నారు అవినాష్రెడ్డి. వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో విచారణకు రావాలని ఆదేశించింది. దీనికోసం తెల్లవారుజామునే కడప నుంచి బయల్దేరిన ఎంపీ అవినాష్రెడ్డి.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.. ఓవైపు సీబీఐ విచారణ.. మరోవైపు హైకోర్టు విచారణ.. ఇలా వైఎస్ వివేకా హత్య కేసులో ఒకేరోజు కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో.. ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!