CM YS Jagan: సీఎం జగన్ వల్ల నా చిన్ననాటి కల నెరవేరింది: ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP MLA Varaprasad Rao Says CM YS Jagan made my childhood dream come true: ఏపీ సీఎం వైఎస్ జగన్ వల్లే తన చిన్ననాటి కల నెరవేరిందని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎవరు పెడతారోనని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, ఆ కల సీఎం జగన్ వల్ల నెరవేరిందన్నారు. మళ్లీ మళ్లీ జగన్ను గెలిపించుకుంటే మన తలరాతలు మారుతాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి కారణ జన్ముడు.. అభినవ అంబేద్కర్ అని ఎమ్మెల్యే వరప్రసాద్ పేర్కొన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ… ‘గతంలో పార్టీ మారితే నాకు 100 కోట్ల వరకూ ఇవ్వాలని నారా టీడీపీ అధినేత చంద్రబాబు చూశారు. పార్టీ మారనని చెప్పడంతో ఆ తర్వాత నుంచి కనీసం మాట్లాడటానికి కూడా ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు. పాదయాత్రలో జగన్ హామీలు ప్రకటిస్తుంటే.. చేయగలరా? అనుకున్నా. సీఎం అయిన తర్వాత ఆయన హామీలు నెరవేరుస్తుంటే ఆశ్చర్యపోయా. జగన్ మోహన్ రెడ్డి కారణ జన్ముడు, అభినవ అంబేద్కర్. జగన్ అమ్మఒడి పెట్టడం వల్ల నా జీవితాశయం నెరవేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎవరు పెడతారోనని చిన్ననాటి నుంచి కలలు కన్నా. సీఎం జగన్ వల్ల నాకల నెరవేరింది’ అని అన్నారు.
Also Read
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులోకి ఆ నలుగురు! తుది జట్టు ఇదే
‘నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మళ్లీ మళ్లీ జగన్ను గెలిపించుకుంటే మన తలరాతలు మారుతాయి. దళితుల్లో ఎవరూ పుట్టకూడదని మమ్మల్ని చంద్రబాబు ఎంతో అవమానించారు. ఈ ప్రభుత్వంలో కేవలం దళితులకే ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల కోట్ల మేర మేలు జరిగింది. స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కాగ్ తప్పుపట్టడం బాధాకరం. కాగ్ వంటి సంస్థలు నివేదికలు ఇచ్చేముందు సమాజంలో అసమానతలను చూడాలి’ అని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!