World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?
- 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది లక్ష్యం
- కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడి
- ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాకింగ్ న్యూస్ తెలిపిన వరల్డ్ బ్యాంక్
- భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 7 దశాబ్ధాలు పడుతుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాక్గా ఉంటుంది. భారతదేశం, ప్రపంచంలోని అనేక దేశాలు సంపన్నులు కావడానికి సంవత్సరాలు పట్టవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారత్ లాంటి దేశం సంపన్నంగా మారడానికి 7 దశాబ్దాలకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది.
READ MORE:Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
చైనాకు 10 ఏళ్లు, భారత్కు 75 ఏళ్లు..
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాలలో అధిక ఆదాయ దేశంగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి. భారతదేశం, యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచ బ్యాంకు ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: మిడిల్ ఇన్కమ్ ట్రాప్’ ప్రకారం.. యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి చైనాకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇండోనేషియాకు దాదాపు 70 సంవత్సరాలు పడుతుంది. ఈ నివేదిక గత 50 సంవత్సరాల అనుభవం ఆధారంగా రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.
READ MORE:Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
ప్రపంచంలోని ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదవారు..
2023 చివరి నాటికి, ప్రపంచ బ్యాంక్ 108 దేశాలను మధ్య ఆదాయ సమూహంగా వర్గీకరించింది. వారి తలసరి వార్షిక GDP యూఎస్$1,136 నుంచి యూఎస్$13,845 వరకు ఉంది. ప్రపంచ జనాభాలో 75 శాతం ఉన్న ఈ దేశాలలో ఆరు బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు.
READ MORE:Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారు?
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అనేక మధ్య-ఆదాయ దేశాలు ఇప్పటికీ గత శతాబ్దపు వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను పెంచడానికి రూపొందించిన విధానాలపై ఆధారపడుతున్నాయి. ఫస్ట్ గేర్లో పెట్టి కారును వేగంగా నడపడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ దేశాలు పాత వ్యూహానికి కట్టుబడి ఉంటే, ఈ మధ్య నాటికి సంపన్న సమాజాలను నిర్మించే రేసులో ఈ దేశాలు చాలా వరకు వెనుకబడిపోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మీత్ గిల్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!