World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?
- 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది లక్ష్యం
- కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడి
- ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాకింగ్ న్యూస్ తెలిపిన వరల్డ్ బ్యాంక్
- భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 7 దశాబ్ధాలు పడుతుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాక్గా ఉంటుంది. భారతదేశం, ప్రపంచంలోని అనేక దేశాలు సంపన్నులు కావడానికి సంవత్సరాలు పట్టవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారత్ లాంటి దేశం సంపన్నంగా మారడానికి 7 దశాబ్దాలకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది.
READ MORE:Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
చైనాకు 10 ఏళ్లు, భారత్కు 75 ఏళ్లు..
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాలలో అధిక ఆదాయ దేశంగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి. భారతదేశం, యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచ బ్యాంకు ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: మిడిల్ ఇన్కమ్ ట్రాప్’ ప్రకారం.. యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి చైనాకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇండోనేషియాకు దాదాపు 70 సంవత్సరాలు పడుతుంది. ఈ నివేదిక గత 50 సంవత్సరాల అనుభవం ఆధారంగా రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.
READ MORE:Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
ప్రపంచంలోని ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదవారు..
2023 చివరి నాటికి, ప్రపంచ బ్యాంక్ 108 దేశాలను మధ్య ఆదాయ సమూహంగా వర్గీకరించింది. వారి తలసరి వార్షిక GDP యూఎస్$1,136 నుంచి యూఎస్$13,845 వరకు ఉంది. ప్రపంచ జనాభాలో 75 శాతం ఉన్న ఈ దేశాలలో ఆరు బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు.
READ MORE:Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారు?
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అనేక మధ్య-ఆదాయ దేశాలు ఇప్పటికీ గత శతాబ్దపు వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను పెంచడానికి రూపొందించిన విధానాలపై ఆధారపడుతున్నాయి. ఫస్ట్ గేర్లో పెట్టి కారును వేగంగా నడపడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ దేశాలు పాత వ్యూహానికి కట్టుబడి ఉంటే, ఈ మధ్య నాటికి సంపన్న సమాజాలను నిర్మించే రేసులో ఈ దేశాలు చాలా వరకు వెనుకబడిపోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మీత్ గిల్ అన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!