World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?
- 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది లక్ష్యం
- కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడి
- ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాకింగ్ న్యూస్ తెలిపిన వరల్డ్ బ్యాంక్
- భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 7 దశాబ్ధాలు పడుతుందని వెల్లడి
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాక్గా ఉంటుంది. భారతదేశం, ప్రపంచంలోని అనేక దేశాలు సంపన్నులు కావడానికి సంవత్సరాలు పట్టవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారత్ లాంటి దేశం సంపన్నంగా మారడానికి 7 దశాబ్దాలకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది.
READ MORE:Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
చైనాకు 10 ఏళ్లు, భారత్కు 75 ఏళ్లు..
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాలలో అధిక ఆదాయ దేశంగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి. భారతదేశం, యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచ బ్యాంకు ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: మిడిల్ ఇన్కమ్ ట్రాప్’ ప్రకారం.. యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి చైనాకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇండోనేషియాకు దాదాపు 70 సంవత్సరాలు పడుతుంది. ఈ నివేదిక గత 50 సంవత్సరాల అనుభవం ఆధారంగా రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.
READ MORE:Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
ప్రపంచంలోని ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదవారు..
2023 చివరి నాటికి, ప్రపంచ బ్యాంక్ 108 దేశాలను మధ్య ఆదాయ సమూహంగా వర్గీకరించింది. వారి తలసరి వార్షిక GDP యూఎస్$1,136 నుంచి యూఎస్$13,845 వరకు ఉంది. ప్రపంచ జనాభాలో 75 శాతం ఉన్న ఈ దేశాలలో ఆరు బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు.
READ MORE:Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారు?
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అనేక మధ్య-ఆదాయ దేశాలు ఇప్పటికీ గత శతాబ్దపు వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను పెంచడానికి రూపొందించిన విధానాలపై ఆధారపడుతున్నాయి. ఫస్ట్ గేర్లో పెట్టి కారును వేగంగా నడపడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ దేశాలు పాత వ్యూహానికి కట్టుబడి ఉంటే, ఈ మధ్య నాటికి సంపన్న సమాజాలను నిర్మించే రేసులో ఈ దేశాలు చాలా వరకు వెనుకబడిపోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మీత్ గిల్ అన్నారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!