Anakapalle Crime: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, కత్తితో పొడిచి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalle Crime: అనకాపల్లి జిల్లా అచ్యుతపురం లాడ్జిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.. మహాలక్ష్మి అనే యువతిని శ్రీనివాస్ అనే యువకుడు దారుణంగా కత్తితో గాయపరిచి హతమార్చాడు.. మహాలక్ష్మిని హతమర్చడానికి ముందుగానే పథకం ప్రకారం కత్తులు, మత్తు ఇంజెక్షన్ లు తీసుకొని వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. ప్రేమ పేరుతో రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకొని టార్చర్ చేసేవాడని, అది తట్టుకోలేక శ్రీనివాస్ నుండి విడిపోయి ఉంటుందని బంధువులు తెలిపారు.. అయితే, అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ముందుగా అంతా భావించారు..
Read Also: Telangana Politics: ఆ ఇద్దరు.. ఎటువైపు..?
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలెంకు చెందిన ఎస్.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్కుమార్ సోమవారం అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఈ క్రమంలో లాడ్జిలో మహాలక్ష్మి, శ్రీనివాస్ కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్నారు.. లాడ్జి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించారు. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్ కుమార్ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా.. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి శరీరాలపై తీవ్ర గాయాలను గుర్తించారు పోలీసులు.. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు.. కేసు నుంచి తప్పించుకోవడానికే తనపై కూడా దాడి జరిగినట్టు డ్రామా ఆడాడని ఆరోపిస్తున్నారు.. మహాలక్ష్మిపై కక్ష పెంచుకొని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, తమ బిడ్డను తమకు కాకుండా చేసిన శ్రీనివాస్ ను ఉరి తియ్యాలని కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు మహాలక్ష్మి బంధువులు.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..