Anakapalle Crime: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, కత్తితో పొడిచి..!
Anakapalle Crime: అనకాపల్లి జిల్లా అచ్యుతపురం లాడ్జిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.. మహాలక్ష్మి అనే యువతిని శ్రీనివాస్ అనే యువకుడు దారుణంగా కత్తితో గాయపరిచి హతమార్చాడు.. మహాలక్ష్మిని హతమర్చడానికి ముందుగానే పథకం ప్రకారం కత్తులు, మత్తు ఇంజెక్షన్ లు తీసుకొని వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. ప్రేమ పేరుతో రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకొని టార్చర్ చేసేవాడని, అది తట్టుకోలేక శ్రీనివాస్ నుండి విడిపోయి ఉంటుందని బంధువులు తెలిపారు.. అయితే, అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ముందుగా అంతా భావించారు..
Read Also: Telangana Politics: ఆ ఇద్దరు.. ఎటువైపు..?
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలెంకు చెందిన ఎస్.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్కుమార్ సోమవారం అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఈ క్రమంలో లాడ్జిలో మహాలక్ష్మి, శ్రీనివాస్ కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్నారు.. లాడ్జి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించారు. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్ కుమార్ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా.. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి శరీరాలపై తీవ్ర గాయాలను గుర్తించారు పోలీసులు.. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు.. కేసు నుంచి తప్పించుకోవడానికే తనపై కూడా దాడి జరిగినట్టు డ్రామా ఆడాడని ఆరోపిస్తున్నారు.. మహాలక్ష్మిపై కక్ష పెంచుకొని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, తమ బిడ్డను తమకు కాకుండా చేసిన శ్రీనివాస్ ను ఉరి తియ్యాలని కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు మహాలక్ష్మి బంధువులు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!