HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
- నమ్మి పనిలో పెట్టుకుంటే
- ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది
- ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది
నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఆ ఇంటికే కన్నం వేసింది.. ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది. పని మనిషి రూపంలో వచ్చి.. మర్డర్కు పాల్పడిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గాగిలాపూర్ వృద్ధురాలి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మర్డర్ జరిగిన 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసిన పనిమనిషి కవిత. చర్చి గాగిలాపూర్లో వృద్ధురాలు సుశీలమ్మ హత్య కేసులో గతంలో ఆమె ఇంట్లో పనిచేసిన పనిమనిషి కవితే కారణమని పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి నేతృత్వంలో సాగిన దర్యాప్తులో నిందితురాలు హత్యకు సంబంధించిన కీలక విషయాలను ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
గతంలో సుశీలమ్మ ఇంట్లో.. కవిత పనిమనిషిగా పని చేసింది. ఐతే కొన్ని కారణాలరీత్యా పని మానేసింది. ఐతే మళ్లీ సుశీలమ్మ ఇంటికి వచ్చి ఆమెను మాటల్లో పెట్టింది. ముందుగా ఆమెకు కల్లు తాగించి మద్యం మత్తులోకి నెట్టింది. ఆ తర్వాత సోఫాకు ఉండే చెక్క భాగానికి సుశీలమ్మ తలను బలంగా మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికీ ఆమె చనిపోలేదని అనుమానించిన కవిత.. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది…
హత్య అనంతరం సుశీలమ్మ చెవులకు ఉన్న కమ్మలు, ముక్కుపుడకను అపహరించిన కవిత.. ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ను కూడా ఎత్తుకెళ్లింది. మొబైల్ ఫోన్ ఆన్లోనే ఉండటంతో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించింది కవిత. కానీ అది రాకపోవడంతో తన ఇంటి సమీపంలో మట్టిలో పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆ మొబైల్ను గుర్తించి కీలక ఆధారాలను సేకరించారు.
Also Read:YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
మరోవైపు దొంగిలించిన బంగారాన్ని ఓ జ్యువెలరీ షాపులో కరిగించేందుకు ఇచ్చినట్లు కూడా కవిత ఒప్పుకుంది. షాపు యజమానితో మాట్లాడిన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.. ఆమె ఇంటికి సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు.. అనుమానితురాలి కదలికల ఆధారంగా కవితను అదుపులోకి తీసుకున్నట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!