HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
- నమ్మి పనిలో పెట్టుకుంటే
- ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది
- ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఆ ఇంటికే కన్నం వేసింది.. ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది. పని మనిషి రూపంలో వచ్చి.. మర్డర్కు పాల్పడిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గాగిలాపూర్ వృద్ధురాలి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మర్డర్ జరిగిన 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసిన పనిమనిషి కవిత. చర్చి గాగిలాపూర్లో వృద్ధురాలు సుశీలమ్మ హత్య కేసులో గతంలో ఆమె ఇంట్లో పనిచేసిన పనిమనిషి కవితే కారణమని పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి నేతృత్వంలో సాగిన దర్యాప్తులో నిందితురాలు హత్యకు సంబంధించిన కీలక విషయాలను ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
Also Read
- Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
గతంలో సుశీలమ్మ ఇంట్లో.. కవిత పనిమనిషిగా పని చేసింది. ఐతే కొన్ని కారణాలరీత్యా పని మానేసింది. ఐతే మళ్లీ సుశీలమ్మ ఇంటికి వచ్చి ఆమెను మాటల్లో పెట్టింది. ముందుగా ఆమెకు కల్లు తాగించి మద్యం మత్తులోకి నెట్టింది. ఆ తర్వాత సోఫాకు ఉండే చెక్క భాగానికి సుశీలమ్మ తలను బలంగా మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికీ ఆమె చనిపోలేదని అనుమానించిన కవిత.. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది…
హత్య అనంతరం సుశీలమ్మ చెవులకు ఉన్న కమ్మలు, ముక్కుపుడకను అపహరించిన కవిత.. ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ను కూడా ఎత్తుకెళ్లింది. మొబైల్ ఫోన్ ఆన్లోనే ఉండటంతో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించింది కవిత. కానీ అది రాకపోవడంతో తన ఇంటి సమీపంలో మట్టిలో పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆ మొబైల్ను గుర్తించి కీలక ఆధారాలను సేకరించారు.
Also Read:YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
మరోవైపు దొంగిలించిన బంగారాన్ని ఓ జ్యువెలరీ షాపులో కరిగించేందుకు ఇచ్చినట్లు కూడా కవిత ఒప్పుకుంది. షాపు యజమానితో మాట్లాడిన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.. ఆమె ఇంటికి సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు.. అనుమానితురాలి కదలికల ఆధారంగా కవితను అదుపులోకి తీసుకున్నట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు..
తాజావార్తలు
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!