Tragedy : చర్లపల్లి రైల్వే స్టేషన్లో విషాదం.. అత్తగారి ఇంటికి వెళ్తూ అనంత లోకాలకు
- చర్లపల్లి రైల్వే స్టేషన్లో విషాదం
- అత్తగారి ఇంటికి వెళ్తూ ప్రమాదం
- కళ్ళెదుటే తల్లి ట్రైన్ కిందపడి చనిపోవడంతో తల్లడిల్లిన ఇద్దరు పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా దొండపూడికి సెలవుల సందర్భంగా అత్తగారి ఇంటికి వెళ్లే క్రమంలో ఓ మహిళ రైలులో పడ్డారు. ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి శ్వేత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రైల్వే స్టేషన్ వారిని కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. శ్వేత, ఆమె భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలతో కలిసి లింగంపల్లి నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణం ప్రారంభించారు. వారి సీట్లు D-8 బోగీలో ఉండగా, పొరపాటున వారు D-3 బోగీలో ఎక్కారు. అక్కడి ప్రయాణికులు తమ సీట్లు కావని తెలియజేయడంతో, శ్వేత బోగీ మారాలని నిర్ణయించుకున్నారు.
IPL: ఐపీఎల్ చరిత్రలో.. సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
ట్రైన్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు, ఆమె ఇద్దరు పిల్లలు, లగేజీని D-8 బోగీలోకి చేర్చారు. ఆ సమయంలో ట్రైన్ కదలడం ప్రారంభించగా, తానే ఎక్కే ప్రయత్నంలో శ్వేత ట్రైన్ , ప్లాట్ఫామ్ మధ్య పడి రాటుదేలిపోయారు. ఈ దృశ్యాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యి ట్రైన్ చైన్ లాగి ఆపేందుకు ప్రయత్నించినా, అప్పటికే ఆలస్యమైంది. శ్వేత ఘటనా స్థలంలోనే మరణించారు. కళ్లెదుట తల్లి మృతి చెందడం పిల్లలకు తట్టుకోలేని విషాదాన్ని మిగిల్చింది.
ఈ సంఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. బోగీ మారే సమయంలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ప్రయాణికులు తగిన సమయంలో మాత్రమే ట్రైన్ మారాలని, రద్దీ ఉన్న సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!