కేకేఆర్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయి ఆడింది. 278 పరుగులతో కేకేఆర్ బౌలర్లకు నరకం చూపించారు. రెస్ట్ ఆఫ్ సీజన్లో దారుణ విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు చివర్లో వరుస విజయాలతో సీజన్ ని ముగించారు. ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాస్సేన్, ట్రావిస్ హెడ్ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు దాసోహమయ్యారు. నలుదిక్కులా షాట్లు బాదుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు.
Also Read:Kakani Govardhan Reddy: పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక!
ముఖ్యంగా హేన్రిచ్ క్లాస్సేన్ విధ్వంసానికి బౌలర్ల కళ్ళలో రక్తం పారింది. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు నలుగురు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. 2013లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ అప్పటి పూణే వారియర్స్ పై 30 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఆ తర్వాత 14 ఏళ్ళ ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆర్ ఆర్ తరుపున ఆడుతూ గుజరాత్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ.
Also Read:Karnataka: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!
ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్ 37 బంతుల్లో సెంచరీ సాధించి యూసుఫ్ పఠాన్ను సమం చేశాడు. యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇప్పుడు క్లాస్సేన్ కూడా 37 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కు ఆడిన డేవిడ్ మిల్లర్ 2013లో ఆర్సీబీపై 38 బంతుల్లో శతకం నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీపై 39 బాల్స్ లో సెంచరీ బాదాడు.