Arvind Kejriwal: పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వాలకు విద్యే ప్రాధాన్యత అని.. ఢిల్లీ, పంజాబ్లలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ అధికారంలో ఉంది. కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ను ఉద్దేశించి ప్రసంగించారు.
ఢిల్లీలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఆప్ సర్కారు కృషి చేస్తోందని, ప్రస్తుతం ప్రభుత్వం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించిందని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చైతన్యవంతులయ్యే వరకు దీని ప్రభావం కనిపించదని అన్నారు. ఢిల్లీ, పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ కూడా ప్రయోగాలు చేస్తుందని, ఢిల్లీ దాని నుంచి నేర్చుకుంటోందని ఆప్ అధినేత అన్నారు.
Also Read
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
Tejashwi Yadav: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. తేజస్వీ కీలక ప్రకటన
ఫిబ్రవరి 6 నుండి 10 వరకు సింగపూర్లో వృత్తిపరమైన శిక్షణ పొందిన పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బృందం ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, విద్యా శాఖను కూడా కలిగి ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. పంజాబ్, ఢిల్లీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యా మంత్రులు రెండు వైపుల ప్రిన్సిపాల్లతో కలిసి ఇలాంటి అభిప్రాయాన్ని పొందడం బహుశా ఇదే మొదటిసారి అని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ ఫిబ్రవరి 4న సింగపూర్లో ప్రొఫెషనల్ టీచర్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొనేందుకు 36 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్తో కూడిన మొదటి బ్యాచ్ను పంపించారు.
తాజావార్తలు
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!