Tejashwi Yadav: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. తేజస్వీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav after meeting Jharkhand CM Soren: 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో ఆయన నివాసంలో భేటీ అనంతరం తేజస్వీ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసినట్లు, భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్ల గురించి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గురించి చర్చించినట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీడియాతో వెల్లడించారు.
జార్ఖండ్లో అధికార కూటమికి చెందిన పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సంకీర్ణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని తేజస్వీ యాదవ్ చెప్పారు. జార్ఖండ్లో పార్టీ పనిని తాను ముందుగానే పర్యవేక్షించాలని అనుకున్నానని అయితే ఆర్జేడీ చీఫ్ , తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా జార్ఖండ్లో పర్యటించలేకపోయానని వెల్లడించారు. సింగపూర్లో తన తండ్రికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఆ దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. తన మాతృభూమికి తిరిగి వస్తారని, ఆయన ప్రాణం ఈ భూమితో ముడిపడి ఉందన్నారు. ఇదే సమయంలో మేము బీహార్ లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బీజేపీని అధికారం నుండి తొలగించడంలో సక్సెస్ అయ్యామన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
bachelors padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్లు
ఇక జార్ఖండ్ లో బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తామని కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బీహార్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు దిగుతోందని మండిపడ్డారు. అయినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఆర్జేడీ నేత శ్యామ్ రజక్, జేఎంఎం అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని తేజస్వీ యాదవ్ ఆకాంక్షించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఫిబ్రవరి 9న రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!