Tejashwi Yadav: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. తేజస్వీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav after meeting Jharkhand CM Soren: 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో ఆయన నివాసంలో భేటీ అనంతరం తేజస్వీ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసినట్లు, భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్ల గురించి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గురించి చర్చించినట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీడియాతో వెల్లడించారు.
జార్ఖండ్లో అధికార కూటమికి చెందిన పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సంకీర్ణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని తేజస్వీ యాదవ్ చెప్పారు. జార్ఖండ్లో పార్టీ పనిని తాను ముందుగానే పర్యవేక్షించాలని అనుకున్నానని అయితే ఆర్జేడీ చీఫ్ , తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా జార్ఖండ్లో పర్యటించలేకపోయానని వెల్లడించారు. సింగపూర్లో తన తండ్రికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఆ దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. తన మాతృభూమికి తిరిగి వస్తారని, ఆయన ప్రాణం ఈ భూమితో ముడిపడి ఉందన్నారు. ఇదే సమయంలో మేము బీహార్ లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బీజేపీని అధికారం నుండి తొలగించడంలో సక్సెస్ అయ్యామన్నారు.
Also Read
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
bachelors padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్లు
ఇక జార్ఖండ్ లో బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తామని కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బీహార్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు దిగుతోందని మండిపడ్డారు. అయినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఆర్జేడీ నేత శ్యామ్ రజక్, జేఎంఎం అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని తేజస్వీ యాదవ్ ఆకాంక్షించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఫిబ్రవరి 9న రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
-
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
-
Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?