Arvind Kejriwal: పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వాలకు విద్యే ప్రాధాన్యత అని.. ఢిల్లీ, పంజాబ్లలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ అధికారంలో ఉంది. కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ను ఉద్దేశించి ప్రసంగించారు.
ఢిల్లీలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఆప్ సర్కారు కృషి చేస్తోందని, ప్రస్తుతం ప్రభుత్వం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించిందని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చైతన్యవంతులయ్యే వరకు దీని ప్రభావం కనిపించదని అన్నారు. ఢిల్లీ, పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ కూడా ప్రయోగాలు చేస్తుందని, ఢిల్లీ దాని నుంచి నేర్చుకుంటోందని ఆప్ అధినేత అన్నారు.
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
Tejashwi Yadav: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. తేజస్వీ కీలక ప్రకటన
ఫిబ్రవరి 6 నుండి 10 వరకు సింగపూర్లో వృత్తిపరమైన శిక్షణ పొందిన పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బృందం ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, విద్యా శాఖను కూడా కలిగి ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. పంజాబ్, ఢిల్లీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యా మంత్రులు రెండు వైపుల ప్రిన్సిపాల్లతో కలిసి ఇలాంటి అభిప్రాయాన్ని పొందడం బహుశా ఇదే మొదటిసారి అని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ ఫిబ్రవరి 4న సింగపూర్లో ప్రొఫెషనల్ టీచర్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొనేందుకు 36 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్తో కూడిన మొదటి బ్యాచ్ను పంపించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!