Parliament : పార్లమెంటులో మైక్లను ఎవరు ఆన్ – ఆఫ్ చేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament : పార్లమెంట్లో మైక్లు స్విచ్ ఆఫ్ చేశారని, తన వాయిస్ని సైలెంట్ చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మూడు రోజుల పాటు తన మైక్రోఫోన్ మ్యూట్ అయిందని ఆరోపిస్తూ లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బుధవారం స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వారి ఆరోపణల నేపథ్యంలో ఒక ప్రశ్న తెరపైకి వచ్చింది. పార్లమెంటు సభ్యుల మైక్రోఫోన్లను ఎవరు ఆన్ లేదా ఆఫ్ చేస్తారు? వాటి ప్రోటోకాల్లు ఏమిటి?
ప్రతి పార్లమెంటు సభ్యునికి నిర్ణీత సీటు ఉంటుంది. మైక్రోఫోన్లు డెస్క్లకు ఫిట్ చేసి ఉంటాయి. ప్రతీ దానికి ఓ స్పెషల్ నెంబర్ ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో సౌండ్ టెక్నీషియన్లు కూర్చునే చాంబర్ ఉంది. వారు లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంటారు. ఛాంబర్లో అన్ని సీట్ల సంఖ్యలతో కూడిన ఎలక్ట్రానిక్ బోర్డు ఉంది. అక్కడ నుండి మైక్రోఫోన్లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దిగువ సభ విషయంలో లోక్సభ సెక్రటేరియట్ సిబ్బంది, ఎగువ సభ విషయంలో రాజ్యసభ సెక్రటేరియట్ సిబ్బంది దీనిని నిర్వహిస్తారు.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
Read Also: High Court Serious: దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు అంటే లెక్కలేదా..?
పార్లమెంట్ కార్యకలాపాలను కవర్ చేసిన నిపుణులు, ప్రముఖ పాత్రికేయులు, మైక్రోఫోన్లను స్విచ్ ఆన్, ఆఫ్ చేయడానికి నిర్దేశిత విధానం ఉందని చెప్పారు. మైక్రోఫోన్లను స్విచ్ ఆఫ్ చేయమని, అది కూడా నిబంధనల ప్రకారం చైర్మన్ మాత్రమే చేయగలదని వారు చెప్పారు. ప్రొసీడింగ్లకు అంతరాయం కలిగితే ఈ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. ఉభయ సభల్లో మైక్రోఫోన్లు మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయబడుతాయి. రాజ్యసభ అధ్యక్షుని ఆదేశాల మేరకు మైక్రోఫోన్లు స్విచ్ ఆన్ చేయబడతాయని డిఎంకె రాజ్యసభ ఎంపి, ప్రముఖ న్యాయవాది పి విల్సన్ చెప్పారు.
Read Also:Damidi Semanthi: తెర వెనుక పోనీవర్మ… తెర మీద రమ్యకృష్ణ!
జీరో అవర్లో ప్రతి సభ్యునికి మూడు నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. అది పూర్తి కాగానే మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. బిల్లులు మొదలైన వాటిపై చర్చలు జరిగినప్పుడు, ప్రతి పక్షానికి సమయం అనుమతించబడుతుంది. చైర్మన్ ను కోరితే మరో ఒకటి లేదా రెండు నిమిషాలు మంజూరు చేస్తారు. ఒక వేళ సభ్యుడు మాట్లాడటం తన వంతు కాకపోతే ఎంపీ మైక్ స్విచ్ ఆఫ్ చేయబడవచ్చు. ప్రత్యేక ప్రస్తావనల విషయంలో, ఎంపీలకు మూడు నిమిషాలు కేటాయిస్తారు. నిర్ణీత సమయం తర్వాత, ఎంపీ మైక్ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!