Lok sabha election: చివరి దశ పోలింగ్లో ఉన్న ప్రముఖులు వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం దేశ వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం జరగబోయే పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
శనివారం వారణాసితో పాటు యూపీలో 13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు బిహార్లోని 8 లోక్సభ స్థానాలకు.. పశ్చిమ బెంగాల్లోని 9 లోక్ సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అటు జార్ఖండ్ రాష్ట్రంలోని 3 స్థానాలు.. పంజాబ్లోని 13 లోక్ సభ సీట్లు.. హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్ సభ సీట్లు.. ఒడిషాలోని 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగర్కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఇది కూడా చదవండి: Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం
ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా వారణాసి నుంచి ప్రధాని మోడీ బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మూడోసారి బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ సాధిస్తామని మోడీ ప్రకటించారు. అలాగే హిమాచల్ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. ఇక కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ పాటలీపుత్ర, నటుడు రవి కిషన్ గోరక్పూర్ నుంచి బరిలో ఉన్నారు.
ఏప్రిల్ 19న మొదటి దశతో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశలో 102 లోక్సభ స్థానాలకు.. రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. థర్డ్ ఫేజ్లో 92 లోక్సభ స్థానాలు.. నాలుగో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి 92 లోక్సభ స్థానాలు..ఐదో దశలో 49 లోక్ సభ సీట్లు.. ఆరో దశలో 58 లోక్సభ సీట్లుకు ఎన్నికలు జరిగాయి. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు నెలలకు పైగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Purandeswari: కేంద్ర ప్రభుత్వం ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఇచ్చింది..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..