Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- వడోదర నగరంలో భారీ చోరీ
- 77 ఖరీదైన స్మార్ట్ఫోన్లు, నగదు అపహరణ
- ఉదయం షోరూమ్ యజమానికి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని వడోదర నగరంలో భారీ చోరీ జరిగింది. అజ్వా రోడ్డులో ఉన్న ప్రముఖ మొబైల్ షోరూమ్ను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దొంగలు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రూ.50 లక్షలకు పైగా విలువైన 77 స్మార్ట్ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొత్తం షోరూమ్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
అర్ధరాత్రి షోరూమ్లోకి ప్రవేశించిన దొంగలు
ఈ సంచలన ఘటన అజ్వా రోడ్డులోని శ్రీ హరి టౌన్షిప్లో ఉన్న “ఫోన్ బుక్” మొబైల్ షోరూమ్లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత మాస్కులు ధరించిన ఇద్దరు దొంగలు మోటార్సైకిల్పై అక్కడికి చేరుకున్నారు. తమ గుర్తింపును దాచుకునేందుకు ముదురు రంగు దుస్తులు, ముఖానికి మాస్కులు ధరించిన వారు షోరూమ్ షట్టర్ను సగం వరకు పైకి ఎత్తి లోపలికి ప్రవేశించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
77 ఖరీదైన స్మార్ట్ఫోన్లు, నగదు అపహరణ
షోరూమ్లోకి ప్రవేశించిన దొంగలు అత్యంత వేగంగా చోరీకి పాల్పడ్డారు. డిస్ప్లే విభాగం, స్టాక్ రూమ్లో ఉన్న ఐఫోన్, శాంసంగ్, వివో తదితర ప్రముఖ బ్రాండ్లకు చెందిన మొత్తం 77 ఖరీదైన మొబైల్ ఫోన్లను అపహరించారు. అంతేకాకుండా కౌంటర్లో ఉన్న రూ.15 వేల నగదును కూడా తీసుకుని పరారయ్యారు. దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల మొత్తం విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా.
ఉదయం షోరూమ్ యజమానికి షాక్
శనివారం ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన షోరూమ్ యజమాని ధర్మేంద్ర త్రిలోకాని, షట్టర్ తెరిచి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. లోపలికి వెళ్లి చూడగా విలువైన మొబైల్ ఫోన్లు కనిపించకపోవడంతో పాటు దుకాణంలోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
సమాచారం అందుకున్న బాపోడ్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించడంతో పాటు షోరూమ్, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. బాపోడ్ పోలీస్ స్టేషన్ పీఐ డి.డి. లాడ్మోర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక నిఘా సహాయంతో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ కీలకం
దొంగతనం జరిగిన మొత్తం ఘటన సీసీటీవీలో స్పష్టంగా రికార్డు కావడంతో, అదే ఆధారంగా పోలీసులు నిందితుల కదలికలను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, వ్యాపారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.
- Tags
- mobile phones
- vadodara
తాజావార్తలు
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!