What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 12వ సార్వత్రిక ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను భారత్కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ పోటీ చేస్తుండగా.. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.
నేడు తిరువూరు, అచంటలో టీడీపీ ‘రా కదిలిరా’ బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానీ మాత్రం దూరంగా ఉండనున్నారు.
Also Read
- Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్లకు నారా లోకేష్ దిశానిర్దేశం
- Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
నేడు ఏపీ బ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశం జరగనుంది. 2024 ఎన్నికల్లో బ్రాహ్మణులకి టికెట్ల కేటాయింపుపై సమావేశం జరగనుంది.
హిందూపురంలో నేటి నుంచి మూడు రోజులు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. మున్సిపాలిటీ , రూరల్ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు బాలకృష్ణ నిర్వహించనున్నారు.
నేడు మంగళగిరిలో నారా లోకేష్ పర్యటించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శించనున్నారు. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ మెట్ల పూజలో ఆయన పాల్గొంటారు.
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొంటారు. అక్కడి నుంచి ఖమ్మం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్ కు చేరుకుంటారు.
Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటలకు పూణేతో తలైవాస్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు హర్యానాలో బెంగాల్ ఢీ కొట్టనుంది.
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలో రా.7 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని హర్మన్ప్రీత్ బృందం పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్లో వైట్వాష్ అయినా తొలి టీ20లో భారత్ గొప్పగా పుంజుకుంది.
తాజావార్తలు
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్లకు నారా లోకేష్ దిశానిర్దేశం
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!