What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 12వ సార్వత్రిక ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను భారత్కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ పోటీ చేస్తుండగా.. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.
నేడు తిరువూరు, అచంటలో టీడీపీ ‘రా కదిలిరా’ బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానీ మాత్రం దూరంగా ఉండనున్నారు.
Also Read
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
నేడు ఏపీ బ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశం జరగనుంది. 2024 ఎన్నికల్లో బ్రాహ్మణులకి టికెట్ల కేటాయింపుపై సమావేశం జరగనుంది.
హిందూపురంలో నేటి నుంచి మూడు రోజులు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. మున్సిపాలిటీ , రూరల్ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు బాలకృష్ణ నిర్వహించనున్నారు.
నేడు మంగళగిరిలో నారా లోకేష్ పర్యటించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శించనున్నారు. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ మెట్ల పూజలో ఆయన పాల్గొంటారు.
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొంటారు. అక్కడి నుంచి ఖమ్మం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్ కు చేరుకుంటారు.
Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటలకు పూణేతో తలైవాస్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు హర్యానాలో బెంగాల్ ఢీ కొట్టనుంది.
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలో రా.7 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని హర్మన్ప్రీత్ బృందం పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్లో వైట్వాష్ అయినా తొలి టీ20లో భారత్ గొప్పగా పుంజుకుంది.
తాజావార్తలు
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!