What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ 49వ రోజుకు చేరింది. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు ములాఖత్ కానున్నారు. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది.
నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి గారు పరామర్శించనున్నారు. రేణిగుంట సమీపంలోని ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబ సభ్యుల భువనేశ్వరి పరామర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో పాత ఆర్టీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ‘నిజం గెలవాలి’ సభలో ఆమె మాట్లాడుతారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
నేడు తిరుపతిలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 9 గంటలకు బాలాజీ కాలానికి పూలే విగ్రహం పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు గ్రూప్స్ సినిమా హాల్ సమీపంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ యాత్రను ఎంపీ విజయసాయి రెడ్డి ప్రారంభించనున్నారు.
నేడు సిరిసిల్లలో బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో “యువ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.
నేడు మహబూబాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. కేసీఆర్ సమక్షంలో బీఅర్ఎస్ లో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహబూబాబాద్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పాలేరు నుంచి మహబూబాబాద్ వస్తారు.
నేడు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు మహబూబాబాద్ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ చేరుకుంటారు.
నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
- Tags
- ap
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?