What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక
- వల్లభనేని వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
- నేడు గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గుంటూరులో కేంద్ర పౌర విమానాయ శాఖమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. హిందూ ఫార్మసీ కళాశాలలో వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో కేంద్రమంత్రి సమావేశం కానున్నారు.
నేడు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల పాల్గొననున్నారు.
Also Read
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. నేటి సాయంత్రం తిరిగి నిందితులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో రెండోరోజు కొనసాగనుంది. నేడు సదస్సులో విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సురేష్ హవారే, గోవా పర్యాటక మంత్రి రోహన్, ఇస్కాన్ కమ్యునికేషన్స్ డైరెక్టర్ గోవింద దాస్ పాల్గొనున్నారు.
నేడు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైస్ చైర్మన్ కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది.
నేడు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్ ప్రకటించారు.
నేడు వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఈరోజు ఉదయం 11:30 గంటలకు సచివాలయంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రంజాన్ నెల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరగనుంది.
నేడు, రేపు రాజస్థాన్ ఉదయ్ పూర్లో వాటర్ విజన్ 2047 సదస్సు జరగనుంది. తెలంగాణాలో గ్రామీణ మంచినీటి సరఫరాపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు.
డబ్ల్యూపీఎల్-3లో భాగంగా నేడు గుజరాత్ జెయింట్స్ ఉమెన్, ముంబై ఇండియన్స్ ఉమెన్ మధ్య మ్యాచ్ జరగనుంది. వడోదరలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!