What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నువ్వా, నేనా అన్నట్లుగా సాగుతున్న మండలి సమావేశాలు
- ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా మండలి సమావేశాలు సాగుతున్నాయి.
ఇవాళ విచారణకు రావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. కాకినాడ సీ పోర్టు షేర్లు బదిలీ వ్యవహారంపై విజయ సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.
వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలు వద్ద వైసీపీ జెండాలు ఎదురు వేయటానికి సన్నాహాలు చేశారు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపి యువత పోరు, అలానే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు, అనంతరం ధర్నాలు చేయనున్న నేతలు.
విద్యార్థులు, యువత సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు యువత పోరు జరగనుంది. జిల్లాపరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన కొనసాగనుంది.
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు నేడు విచారణ జరపనుంది.
నేటి నుండి మద్దికేర (మం) పెరవలి శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి వారికి మంగళ హారతి, కుంకుమార్చన, అభిషేకాలు, పంచామృత సేవలతో ప్రత్యేక పూజలు జరగనున్నాయి.
ఇవాళ శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో నాలుగోవ రోజు. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తెప్పలపై విహరించనున్నారు.
నేటితో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరింది. GPR, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం చేస్తారు. ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
నేడు రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 1,292 మంది జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.
ఈరోజు ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మంత్రి తుమ్మల శంఖుస్థాపన చేయనున్నారు.
నేడు భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా మంచు మనోజ్, మౌనిక దంపతులు ఆళ్లగడ్డకు రానున్నారు. శోభ ఘాట్ వద్ద భూమా నాగిరెడ్డికి మనోజ్, మౌనికలు నివాళులర్పించనున్నారు.
తాజావార్తలు
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
-
RCB vs DC: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా నయా హిస్టరీ..
-
Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!