WFI India: ప్రపంచ వేదికపై భారత్కు భారీ షాక్.. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వం రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UWW has suspended the membership of the WFI: ప్రపంచ వేదికపై భారత రెజ్లింగ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ప్రకటించింది. ఎన్నికలను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైన కారణంగా యూడబ్ల్యూడబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో డబ్ల్యుఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
భారతదేశం యొక్క రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన ఫెడరేషన్ జూన్ 2023లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ భారతీయ రెజ్లర్ల వరుస నిరసనలు మరియు వివిధ రాష్ట్ర విభాగాల నుంచి వచ్చిన పిటిషన్ల కారణంగా ఎన్నికలు పదేపదే వాయిదా పడ్డాయి. దాంతో డబ్ల్యూఎఫ్ఐ తన ఎన్నికలను సకాలంలో నిర్వహించనందుకు యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెండ్ చేసింది. దాంతో ప్రపంచ ఛాంపియన్షిప్లలో పోటీ చేయడానికి భారతీయ రెజ్లర్లకు అనుమతి ఉండదు. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్-క్వాలిఫైయింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు తటస్థ క్రీడాకారులుగా పోటీపడాల్సి ఉంటుంది.
Also Read
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్ఐ వివాదంలో చిక్కుకుంది. శరణ్ సింగ్ను పదవి నుంచి తప్పించాలని ఆందోళన చేయడంతో.. డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ను ఐఓఏ రద్దు చేసింది. ఆపై నిర్వహణ బాధ్యతను అడ్హక్ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ అయింది. అప్పటినుంచి 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్కు ఎన్నికలు నిర్వహించాలి.
Also Read: World Cup 2023: చంద్రయాన్ 3 విజయవంతం.. ఇక భారత్దే ప్రపంచకప్ 2023!
గడువులోగా ఎన్నికలు పూర్తిచేయాలని, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదని ఏప్రిల్ 28న యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరించింది. అప్పటినుంచి పలు కారణాలతో డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. చివరికి ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా.. ఒక రోజు ముందు పంజాబ్-హరియాణా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు జరగలేదు. ఈ క్రమంలోనే భారత సభ్యత్వంపై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు వేసింది.
తాజావార్తలు
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..