Mamata Banerjee: బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్(UC)పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు 52 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ యూసీలను ఇప్పటి వరకు సమర్పించలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఉత్తర మాల్దా లోక్ సభ పరిధిలోని హరిశ్చంద్రపూర్ లో దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read
ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ..మా ప్రభుత్వం 2.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసి వాటికి సంబంధించిన యూసీలను సమర్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సభలో ఆరోపించారు.. దానిని నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నాను అని ఆమె డిమాండ్ చేశారు. ఇదంతా అసత్య ప్రచారం.. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి యూసీని సమర్పించామన్నారు. అంతకు ముందు సీపీఎం పాలనలో జరిగిన వాటికి మాత్రం నేను బాధ్యత వహించను అని ముఖ్యమంత్రి మమతా తెలిపారు.
Read Also: Siddharth Roy OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సిద్దార్థ రాయ్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా, ఉపాధి హామీ పనికి సంబంధించిన నిధులను నిలిపి వేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్రం ముందు తాము ఎప్పటికీ తలవంచబోనని చెప్పారు. బెంగాల్లో ఎన్ఆర్సీ, యునిఫాం సివిల్ కోడ్ (ucc) బిల్లులను అమలు చేయబోమని మమతా బెనర్జీ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..