AP Elections 2024: నందమూరి బ్రదర్స్.. నేటి నుంచి రామకృష్ణ ప్రచారం.. రేపటి నుంచి బాలయ్య ఉత్తరాంధ్ర టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఏపీలో అన్ని పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయి.. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు నేతల సవాళ్లు, విమర్శలు, ఆరోపణలు మరింత హీట్ పెంచుతున్నాయి.. ఇక, నేతల తరపున తమ కుటుంబ సభ్యులు.. పార్టీ కోసం కీలక నేతలు, రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న కుటుంబాలకు చెందినవాళ్లు ఇలా అంతా రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా నేటి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు నందమూరి రామకృష్ణ.. ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.. ఈ రోజు నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించి, అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్న నందమూరి రామకృష్ణ. అనంతరం గుడివాడ, పెడన, పామర్రు నియోజకవర్గాలలో ప్రచారంలో పాల్గొననున్నారు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు.. ఎన్నికల వరకు ప్రచారంలో పాల్గొనే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారట నందమూరి రామకృష్ణ.
Read Also: Siddharth Roy OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సిద్దార్థ రాయ్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
మరోవైపు.. నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.. మరోసారి హిందూపురం బరిలోకి దిగిన ఆయన.. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు.. బహిరంగ సభల్లో పాల్గొంటూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇక, రేపే బాలయ్య ఉత్తరాంధ్ర టూర్ ప్రారంభం కాబోతోంది. మే 2వ తేదీన గురువారం రోజు సాయంత్రం 4:30 గంటలకు చీపురుపల్లి, సాయంత్రం 6 గంటలకు విజయనగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు బాలయ్య.. ఇక, మే 3వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 4:30 గంటలకు భీమిలి, సాయంత్రం 6 గంటలకు శృంగవరపు కోటలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 6:45 గంటలకు వైజాగ్ రోడ్డుషోలో పాల్గొననున్నారు నందమూరి బాలకృష్ణ.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!