Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ పాట్నాలో రాజేంద్ర నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గురువారం తేజ్ ప్రతాప్ బక్సర్ ప్రాంతంలో పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించేందుకు వచ్చారు.
Read Also: Congress: ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్
గతంలో బీహార్లో జరిగిన మహాఘటబంధన్ ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ యాదవ్ పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ఆయన మరో టర్మ్లో ఆరోగ్య శాఖ పోర్ట్ఫోలియోను కూడా నిర్వహించారు. ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆర్జేడీ నేతలు కోరుకుంటున్నారు.