Pm Modi: ఎన్నికల ప్రచారంలో మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్ను కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్కు సమాచారాన్ని అందించారు. వారు విచారణ చేపట్టి కాల్ వివరాలను విశ్లేషించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు.
READ MORE: High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని మధ్యప్రదేశ్ పోలీసులకు సూచించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్లోని ఏ లొకేషన్ నుంచి కాల్ చేశాడు ? అతడు ఏ సిమ్ కార్డును వాడాడు ? అనేది గుర్తించడంపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కాగా.. వాంటెడ్ క్రిమినల్స్ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్స్ను ప్రకటించింది. వాటిలోనే ఓ నంబరుకు ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం గమనార్హం. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపుతానంటూ ఓ ఆగంతకుడి నుంచి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న ఒక మీడియా సంస్థకు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానిపై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా వచ్చిన ఈ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన బహిరంగ సభతో పాటు తప్పకుండా రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ భద్రతా సిబ్బందిలో గుబులు పుట్టిస్తోంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!