Pm Modi: ఎన్నికల ప్రచారంలో మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్ను కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్కు సమాచారాన్ని అందించారు. వారు విచారణ చేపట్టి కాల్ వివరాలను విశ్లేషించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు.
READ MORE: High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది
Also Read
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని మధ్యప్రదేశ్ పోలీసులకు సూచించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్లోని ఏ లొకేషన్ నుంచి కాల్ చేశాడు ? అతడు ఏ సిమ్ కార్డును వాడాడు ? అనేది గుర్తించడంపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కాగా.. వాంటెడ్ క్రిమినల్స్ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్స్ను ప్రకటించింది. వాటిలోనే ఓ నంబరుకు ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం గమనార్హం. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపుతానంటూ ఓ ఆగంతకుడి నుంచి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న ఒక మీడియా సంస్థకు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానిపై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా వచ్చిన ఈ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన బహిరంగ సభతో పాటు తప్పకుండా రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ భద్రతా సిబ్బందిలో గుబులు పుట్టిస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!