High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్రెడ్డి తన వాదనలు వినిపించారు. “నారా లోకేష్ X లో evm ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారు. దీనిని ఆధారంగా కేసు నమోదు చేయటం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ కు వెళ్లటం సరికాదు. ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయాలని నేరుగా ఆదేశాలు ఇవ్వటం సరికాదు. లోకేష్ X లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారు. EVM ధ్వంసం విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చేశారని విధుల్లో ఉన్న పీఓ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసిన FIR లో కూడా ఇదే అంశాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ X లో ఒక వీడియో ను పోస్ట్ చేశారు. అది మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉంది.” అని వాధించారు. పిటిషనర్ పలు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లను కొట్ చేశారు. ఏడేళ్ళ లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సేక్షన్లుతో నమోదు చేసిన ఈ కేసులో నోటీసు ఇవ్వచ్చని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో ఉందని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరిన ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోరారు. సింగిల్ బెంచ్లో న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి డివిజనల్ బెంచ్లో న్యాయమూర్తి కావడంతో అక్కడ విచారణ ఉందని పిటిషన్పై విచారణ కొద్దిసేపు వాయిదా వేశారు. ఇంకా పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది.
READ MORE: AP High Court: ఐపీఎస్ అధికారి ఏబీ పిటిషన్ పై హైకోర్టులో 2గంటలుగా కొనసాగుతున్న విచారణ
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
కాగా.. కాగా.. మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు వెళ్లాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరుగుతోంది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!