Revanth Reddy: కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పులకు రూ. 30 వేల కోట్లు చెల్లించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో మేము కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలన చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపడితే.. మార్చి 17వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా ఎన్నికల అధికారుల పరిధిలోకి వెళ్లిపోయాయి అని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు. 3 నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.. బలహీల వర్గాల కులగనణకు ఆదేశాలు జారీ చేశామని చెప్పుకొచ్చారు. అలాగే, రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఇక, ఆర్టీసీ బస్సులో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా లబ్ది పొందారన్నారు. 40 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ ద్వారా లబ్ధిపొందుతున్నారు.. 50లక్షల ఫ్యామిలీలు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ద్వారి లబ్ది పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Online Gaming Fraud: ఆన్లైన్ గేమ్స్ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అప్పుకు దాదాపు 30వేల కోట్ల రూపాయల మిత్తిని చెల్లించామన్నారు. కేసీఆర్ వారసత్వంగా ఎండిపోయిన చెరువులను ఇస్తే.. నీటి సమస్య లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇక, మేము 100 రోజుల్లో మా ప్రభుత్వానికి ప్రజలు 75 శాతం మార్కులు వేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఈ 10 ఏళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు. అలాగే, కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. ఇక, 2014 కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు.. ఐదు సంవత్సరాలు చేయకపోవడంతో పాటు మళ్లీ 2018లో కూడా అదే మాట చెప్పి రైతులను మోసం చేశాడన్నారు. కానీ, ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!