Lakshya Sen: అసలెవరు ఈ లక్ష్య సేన్.. బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా..
- పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్.
- ఉత్తరాఖండ్లోని అల్మోరా నివాసి.
- ఆగస్ట్ 2001లో బెంగాలీ కుటుంబంలో జన్మించిన లక్ష్య సేన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshya Sen: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ 2024 పారిస్ ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరిన తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్లో భారత్ 3 కాంస్య పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మను భాకర్ తొలి పతకం సాధించింది. దీని తర్వాత, ఆమె సరబ్జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ టీమ్లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాగే స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. ఇప్పుడు లక్ష్య సేన్ కూడా ఒలింపిక్ పతకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
Indian Organ Donation Day : అవయవ దానం గురించి అపోహలు.. నిపుణులు ఏమన్నారంటే ?
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ ఉత్తరాఖండ్లోని అల్మోరా నివాసి. ఆగస్ట్ 2001లో బెంగాలీ కుటుంబంలో జన్మించిన లక్ష్య సేన్ చిన్నపాటి నుండే బ్యాడ్మింటన్ను మొదలు పెట్టాడు. అతని తాత చంద్ర లాల్ సేన్ అల్మోరాలో బ్యాడ్మింటన్ ఆటను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. ఇక అతని తండ్రి డి.కె. సేన్ అతని కోచ్. 2022 కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది కాకుండా, 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో లక్ష్య సేన్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక 2021 ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశపు అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. లక్ష్యసేన్ 19-21, 21-15, 21-12తో చైనీస్ తైపీ ఆటగాడు చౌ టియెన్ చెన్ ను ఓడించి ఒలింపిక్స్లో సెమీ ఫైనల్ కు చేరుకున్న తొలి భారతీయ పురుష షట్లర్గా నిలిచాడు.
Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?
ఇప్పుడు సెమీ ఫైనల్లో అతను సింగపూర్కు చెందిన లోహ్ కీన్ యూ, డెన్మార్క్కు చెందిన విక్టర్ అక్సెల్సెన్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడతాడు. ఇక క్వాటర్ ఫైనల్ లో తొలి గేమ్ ఓడిన లక్ష్యసేన్ రెండో గేమ్లో తనమేటి ఆట ఆడాడు. దీని తర్వాత నిర్ణయాత్మక గేమ్ను భారీ తేడాతో గెలిచి భారత షట్లర్ సెమీఫైనల్ టిక్కెట్ ను ఖాయం చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!