Sri Lanka: భారత్తో సిరీస్కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ..
- భారత్తో సిరీస్కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ
- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వనిందు హసరంగ
- ఈ విషయాన్ని ధృవీకరించిన శ్రీలంక క్రికెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. భారత్- శ్రీలంక మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. అయితే.. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధృవీకరించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో తన సారథ్యంలోని జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కారణంగా హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా తన నిర్ణయం తీసుకున్నట్లు హసరంగ తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు.
Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
“ఒక ఆటగాడిగా నేను ఎల్లప్పుడూ శ్రీలంక కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను.. నేను ఎప్పటిలాగే నా జట్టు, నాయకత్వానికి మద్దతు ఇస్తాను.” హసరంగా తెలిపారు. “మా అంతర్జాతీయ క్రికెట్ ప్రణాళికలలో హసరంగా మాకు ఒక ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతారని శ్రీలంక క్రికెట్ తెలియజేస్తుంది” అని శ్రీలంక క్రికెట్ అతని రాజీనామాను ఆమోదిస్తూ ఒక ప్రకటనలో తెలిపింది.
Wagon R: సరికొత్త మైలురాయిని సాధించిన వ్యాగన్ఆర్.. ఐదేళ్లలో 10 లక్షలకు పైగా కార్ల విక్రయం
అమెరికా, వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా, కోచింగ్ సిబ్బందిలో కూడా ముఖ్యమైన మార్పులు జరిగాయి. ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ గతంలో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. సిల్వర్వుడ్ మార్గదర్శకత్వంలో శ్రీలంకకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్లో వనిందు హసరంగ నేతృత్వంలోని జట్టు నెదర్లాండ్స్తో జరిగిన ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. కాగా.. జూలై 26న పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నెలాఖరులో భారత్తో టీ20, వన్డే సిరీస్ల షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ప్రకటించింది. ఈ సమయంలో శ్రీలంక-భారత్ మధ్య మూడు టీ-20, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. భారత కోచ్గా గౌతమ్ గంభీర్కి ఇదే తొలి పర్యటన.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!