Amit Shah: తెలంగాణలో ఓటు షేర్ పెరిగింది.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా, ప్రధాన మంత్రిగా ఒక్క అవినీతి మరక కూడా లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే వ్యక్తి నరేంద్రమోడీ అని ప్రశంసించారు. సెలవులు కోసమని విదేశాలకు వెళ్లే వ్యక్తి రాహుల్ గాంధీ అని దుయ్యబట్టారు.
Ap Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు… 70 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టలేదని అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకనే రామందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిందని అన్నారు. అంతేకాకుండా.. నరేంద్ర మోడీ దేశంలో తీవ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక తీవ్రవాద దాడులు జరిగాయి… మోడీ ప్రభుత్వం వచ్చాక దాడులు జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని చెప్పారు.
AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
తెలంగాణ ముఖ్యమంత్రి తన ఫేక్ వీడియోలు షేర్ చేసి అబద్దాలు ప్రచారం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేస్తుందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమా.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ అంటుందని తెలిపారు. తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. గోడం నగేష్ కు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసేదేనని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!