Amit Shah: తెలంగాణలో ఓటు షేర్ పెరిగింది.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా, ప్రధాన మంత్రిగా ఒక్క అవినీతి మరక కూడా లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే వ్యక్తి నరేంద్రమోడీ అని ప్రశంసించారు. సెలవులు కోసమని విదేశాలకు వెళ్లే వ్యక్తి రాహుల్ గాంధీ అని దుయ్యబట్టారు.
Ap Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు
Also Read
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు… 70 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టలేదని అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకనే రామందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిందని అన్నారు. అంతేకాకుండా.. నరేంద్ర మోడీ దేశంలో తీవ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక తీవ్రవాద దాడులు జరిగాయి… మోడీ ప్రభుత్వం వచ్చాక దాడులు జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని చెప్పారు.
AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
తెలంగాణ ముఖ్యమంత్రి తన ఫేక్ వీడియోలు షేర్ చేసి అబద్దాలు ప్రచారం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేస్తుందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమా.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ అంటుందని తెలిపారు. తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. గోడం నగేష్ కు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసేదేనని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..