Amit Shah: తెలంగాణలో ఓటు షేర్ పెరిగింది.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా, ప్రధాన మంత్రిగా ఒక్క అవినీతి మరక కూడా లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే వ్యక్తి నరేంద్రమోడీ అని ప్రశంసించారు. సెలవులు కోసమని విదేశాలకు వెళ్లే వ్యక్తి రాహుల్ గాంధీ అని దుయ్యబట్టారు.
Ap Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు… 70 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టలేదని అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకనే రామందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిందని అన్నారు. అంతేకాకుండా.. నరేంద్ర మోడీ దేశంలో తీవ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక తీవ్రవాద దాడులు జరిగాయి… మోడీ ప్రభుత్వం వచ్చాక దాడులు జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని చెప్పారు.
AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
తెలంగాణ ముఖ్యమంత్రి తన ఫేక్ వీడియోలు షేర్ చేసి అబద్దాలు ప్రచారం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేస్తుందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమా.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ అంటుందని తెలిపారు. తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. గోడం నగేష్ కు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసేదేనని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!