AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి క్రిష్ పర్యవేక్షణలో సినిమా పూర్తి చేస్తారని ఈ మధ్యనే అధికారిక ప్రకటన వెలువడింది.
Shobha Shetty: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న.. కాబోయే భర్తతో శోభ వీడియో వైరల్
Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే సరిగ్గా ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం ఉండగా జనసేన ఎన్నికల ప్రచార పర్యవేక్షణ నిమిత్తం ఏఎం రత్నంని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు జనసేన నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారంటూ అందులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో శ్రీకాళహస్తికి చెందిన జనసేన నేత కోట వినుతను తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. నిజానికి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి బలపరిచిన ఆయన తిరుపతి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏఎం రత్నాన్ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తిరుపతి నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!