AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి క్రిష్ పర్యవేక్షణలో సినిమా పూర్తి చేస్తారని ఈ మధ్యనే అధికారిక ప్రకటన వెలువడింది.
Shobha Shetty: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న.. కాబోయే భర్తతో శోభ వీడియో వైరల్
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే సరిగ్గా ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం ఉండగా జనసేన ఎన్నికల ప్రచార పర్యవేక్షణ నిమిత్తం ఏఎం రత్నంని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు జనసేన నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారంటూ అందులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో శ్రీకాళహస్తికి చెందిన జనసేన నేత కోట వినుతను తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. నిజానికి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి బలపరిచిన ఆయన తిరుపతి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏఎం రత్నాన్ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తిరుపతి నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!