Vivek Venkataswamy: అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన.. ధ్వజమెత్తిన మెత్తిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని B1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను 60 వేల కోట్ల అప్పుల నుంచి 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని, దీనికి వడ్డీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా 5 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని అన్నారు.
Road Accident: ORRపై కారు బీభత్సం.. పలువురికి గాయాలు!
Also Read
- ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివేక్ తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడించారు. అలాగే 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Sand Mafia: ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలి..! రోడ్డున పడిన మూడు కుటుంబాలు..
ఇక కొత్త గనుల విషయంలో ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివేక్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా చేసి, తద్వారా ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందని విమర్శించారు. అలాగే మిషన్ భగీరథ పథకం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని వివేక్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 42 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఇంటికి కూడా తాగునీరు అందించలేదని ఆరోపించారు. పథకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు దోచుకుందని ఆయన వ్యాఖ్యానించారు. మందమర్రి ప్రజలకు అమృత్ స్కీమ్తో శాశ్వత మంచి నీటి సౌకర్యం లభిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించిందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!