తాజాగా తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన హీరో విశాల్ తమిళనాడులో 2026న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధమని., అలాగే కొత్త పార్టీని కూడా స్థాపించబోతున్నట్లు తెలిపిన సంగతి విధితమే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Elections 2024: దేశవ్యాప్తంగా కేవలం 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ.. కారణం అదేనా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని హీరో విశాల్ తెలిపారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్ పై జరిగిన రాయి ఘటనపై విశాల్ స్పందిస్తూ.. ఇది వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి పై ఇలాంటి దాడులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి దాడులను సీఎం జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని.. ఆ పరిస్థితులను తనదైన శైలిలో దాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇకపోతే తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా ఉండడం లేదని., కాకపోతే సీఎం జగన్ అంటేనే తనకి ఓ రకమైన అభిమానమని హీరో విశాల్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో విషయాలు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read: HariHaraVeeraMallu: హరిహరవీరమల్లు అప్డేట్ వచ్చేస్తుంది.. రెడీగా ఉండండమ్మా..
ఇక విశాల్ ‘రత్నం’ అనే సినిమాతో ప్రేక్షకులకు రాబోతున్నాడు. ఇదివరకే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆయన ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యం లోనే విశాల్ హైదరాబాదులో పర్యటించిన సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన తెలిపాడు.