Virender Sehwag: పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ పల్లెలెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ ముందు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్ పాక్కు డూ ఆర్ డైగా మారనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్లో కేవలం పాయింట్స్ మాత్రమే కాదు.. నెట్ రన్రేట్ సైతం పెంచాలి. అప్పటికే న్యూజిలాండ్ +1.390 రన్రేట్తో బలంగా ఉంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం -0.461తో చాలా వెనకబడింది. ఈ కారణం చేత ఈ మ్యాచ్లో కేవలం శ్రీలంకను ఓడిస్తే సరిపోదు. ఉదాహరణకు, పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేస్తే, కనీసం 64 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేకపోతే, 161 లక్ష్యాన్ని చేజ్ చేస్తే 40కి పైగా బంతులు మిగిలి ఉండగానే గెలవాలి. ఈ లెక్కలు చూస్తే సాధ్యమే అనిపిస్తోంది? ప్రాక్టికల్గా అది ఎంతవరకు సాధ్యమో అన్నదే ప్రశ్న. అయితే.. ఈ ప్రశ్నను భారత మాజీ విధ్వంసకర బ్యా్ట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్కు ఎదురైంది. చాలా ఈజీగా సమాధానం ఇచ్చాడు సెహ్వాగ్. క్రిక్బజ్ చర్చలో భాగంగా సెహ్వాగ్ మాట్లాడూతూ.. యాంకర్ లెక్కలు చెబుతుండగానే “అది జరగదు” అంటూ సూటిగా చెప్పేశాడు. లక్ష్యాన్ని భారీ తేడాతో గెలవడం, 13-14 ఓవర్లలో చేజ్ చేయడ పాకిస్థాన్ వల్ల కాదని స్పష్టం చేశాడు.
READ MORE: Big Breaking : బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు
సెహ్వాగ్ తన వాదనను వివరించుతూ.. “ఇంగ్లాండ్ మ్యాచ్లో పాకిస్థాన్ అదృష్టం కలిసి వచ్చింది. కానీ ప్రతీసారి అలా జరగదు. 160 పరుగులు చేసి 60 పరుగుల తేడాతో గెలవాలంటే, శ్రీలంక 90కి ఆల్ అవుట్ కావాలి. అది సాధ్యమే కాదు. 13.2 ఓవర్లలో చేజ్ చేయడం థియరీలో సాధ్యమే కానీ, ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటింగ్ అలాంటి దూకుడులో లేదు” అని అభిప్రాయపడ్డాడు. వాస్తవ పరిస్థితులు సైతం గమనిస్తే.. పాకిస్థాన్ ఇప్పటి వరకు 160 పరుగుల స్కోర్ను సైతం ఈజీగా సాధించలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కోర్ను చేజ్ చేయడం పాకిస్థాన్కు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నెట్ రన్ రేట్ లెక్కలు దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ను పాకిస్థాన్ ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటూ ఆడటం అంత ఈజీ కాదు..
READ MORE: Millets Like Ragi: రాగులకు సమానమైన పోషకాలు కలిగిన చిరుధాన్యాలు.. ఇవి ట్రై చేయండి..