Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- పోలీసుల కళ్లలో కారం కొట్టిన ఖైదీలు
- ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైల్లో భారీ భద్రతా వైఫల్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే జైళ్లలో ఒకటైన ‘అదియాలా సెంట్రల్ జైలు’ (రావల్పిండి జిల్లా జైలు) మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా ఇదే జైల్లో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఇమ్రాన్ ఖాన్ వల్ల కాకుండా, జైలు భద్రతా వ్యవస్థలోని తీవ్ర లోపాల కారణంగా ఈ జైలు వార్తల్లోకెక్కింది. కోర్టు విచారణ ముగించుకుని తిరిగి జైలుకు వస్తున్న క్రమంలో ఏకంగా 14 మంది ఖైదీలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో రావల్పిండి, ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
సినిమా స్టైల్లో స్కెచ్.. పోలీసుల కళ్లలో మిరపపొడి
మీడియా నివేదికల ప్రకారం.. రావల్పిండి జిల్లా కోర్టులో హాజరుపరిచిన అనంతరం 14 మంది అండర్ ట్రయల్ (విచారణలో ఉన్న) ఖైదీలను ఒక పోలీస్ వ్యాన్లో ఎక్కించి తిరిగి అదియాలా జైలుకు తరలిస్తున్నారు. వ్యాన్ సిహాలా/కహుటా ప్రాంత పరిధిలోకి రాగానే ఖైదీలు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం లోపల గొడవ పడటం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వ్యాన్ను ఆపి లోపల ఏం జరుగుతుందో చూడటానికి ప్రయత్నం చేశారు. అదే సమయం కోసం వేచి చూసిన ఖైదీలు.. అత్యంత చాకచక్యంగా పోలీసుల కళ్లలో కారం చల్లారు. కళ్లు కనపడక పోలీసులు విలవిల్లాడుతుండగా, వ్యాన్ తాళాలు పగలగొట్టి 14 మంది ఖైదీలు ఒకేసారి పరారయ్యారు.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్లను వదలడం లేదు..
నలుగురు రీ-అరెస్ట్.. మిగిలిన వారి కోసం వేట
జైలు చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ భద్రతా వైఫల్యంపై రావల్పిండి పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD) పరిసర ప్రాంతాలను ముట్టడించాయి. రహదారులన్నింటినీ నాకాబందీ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసుల జరిపిన మెరుపు దాడిలో పారిపోయిన 14 మందిలో నలుగురు ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకోగలిగారు. అయితే మిగిలిన 10 మంది ఇంకా పరారీలోనే ఉన్నారు. పారిపోయిన వారు దొంగతనాలు, దోపిడీలు వంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని సమాచారం. ఖైదీల పరార్ వెనుక ఏవైనా జైలు సిబ్బంది హస్తం ఉందా లేదా అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఇమ్రాన్ ఖాన్ భద్రతపై ఆందోళన
హై-ప్రొఫైల్ ఖైదీలు ఉండే అదియాలా జైలు పరిసరాల్లోనే ఈ స్థాయి ఘటన జరగడం ఇప్పుడు పాక్ అంతటా చర్చనీయాంశమైంది. అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఇదే జైల్లో ప్రత్యేక బారక్లో ఉన్నారు. ఆయన భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు, పారామిలట్రీ నిఘా ఉన్నప్పటికీ.. ఇలాంటి సంఘటన జరగడం అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుతం పరారైన ఖైదీలు ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండా గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?