Virat Kohli: మరో సెంచరీ వచ్చేది.. కానీ టాస్ గెలిచాం.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: విశాఖపట్నంలో డిసెంబర్ 6న భారత జట్టు సౌతాఫ్రికాపై తొమ్మిది వికెట్ల భారీ విజయంతో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న తర్వాత, టీమిండియా పేసర్ అర్ష్దీప్ ఇంస్టాగ్రామ్ లో ఓ సరదా రీల్ పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ అజేయంగా చేసిన 65 పరుగులపై ఆటపట్టించాడు. ఇప్పటికే రాంచీ, రాయ్పూర్లో వరుసగా రెండు సెంచరీలు చేయరు కదా.. ఈ మ్యాచ్లో కూడా శతకం సాధించే అవకాశం ఉందని అర్ష్దీప్ నవ్వుతూ చెప్పాడు. దీనిపై కోహ్లీ కూడా తన స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు. ఇందులో అవును, మనం టాస్ గెలిచాం. లేదంటే నువ్వూ నీ సెంచరీ పూర్తి చేసేవాడివి అంటూ కోహ్లీ చేసిన జోక్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
Gun Violence: కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి..!
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
విశాఖలో సాయంత్రం డ్యూ కారణంగా బౌలర్లకు టార్గెట్ను డిఫెండ్ చేయడం దాదాపు అసాధ్యం అయ్యింది. ఫలితంగా భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం 39.5 ఓవర్లలోనే చేధించి సిరీస్ను గెలుచుకుంది. రాయ్పూర్ రెండో వన్డేలో కూడా ఇదే పరిస్థితుల వలన భారత బౌలర్లు 358 పరుగులను కాపాడలేకపోయారు. ఈ సిరీస్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైనది. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్కు దూరమైన తర్వాత కోహ్లీ బరువు తగ్గినట్టుగా, మరింత స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. మూడు మ్యాచ్లలో మొత్తం 302 పరుగులు చేసి.. దాదాపు 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీ మ్యాచ్ విజయం ఈ ఫార్మాట్లో అతని ఆధిపత్యం కంపరిచింది. మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక వన్డే సిరీస్లో 300+ పరుగులు సాధించడం కోహ్లీ కెరీర్లో ఇదే మొదటి సారి.
Increase Non-Veg Rates: నాన్ వెజ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చికెన్, మటన్ రేట్లు
ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లీ తన మనసు తెరిచి మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఈ మెంటల్ స్పేస్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బ్యాటింగ్ను నిజంగా ఆస్వాదిస్తున్న దశ ఇది అని చెప్పాడు. కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో జనవరి 2026లో న్యూజిలాండ్ సిరీస్తో తిరిగి కనిపించనున్నాడు. అప్పటి వరకు ఫామ్ను కొనసాగించేందుకు ఢిల్లీ కోసం విజయ్ హజారే ట్రోఫీలో ఆడతాడు.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!