Viral Video: ఇంజన్ లేకుండానే పరుగులు పెట్టిన రైలు.. ఎలాగంటే..!
అప్పుడప్పుడు వాహనాలు ట్రబుల్ ఇచ్చినప్పుడు కొంత మంది తోయడం వంటి సీన్లు చూస్తుంటాం. కానీ ట్రైన్ను అలా తోయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కొంత మంది రైల్వే కార్మికులు, ప్రయాణికులు రైలు బండిని తోయడంతో వేగంగా ముందుకు కదిలింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అసలు ఇంతకీ ఏమైంది? ట్రైన్ను తోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Annamalai: మోడీ కేబినెట్లోకి అన్నామలై..?
Also Read
బీహార్లోని కియుల్ రైల్వే స్టేషన్లో మెమో రైలు ఆగి ఉంది. అందులో ఒక రైలు కోచ్ నుంచి సడన్గా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందకి దిగేసి ప్రమాదం నుంచి తప్పుకున్నారు. అంతటితో ఆగకుండా మంటలు అంటున్న బోగీ నుంచి ఇతర బోగీలకు కూడా మంటలు వ్యాపించకుండా వెంటనే ప్రయాణికులు బోగీలను వేరు చేసేందుకు ప్రయత్నం చేశారు. బోగీలను తోయగా రైలు వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ జంక్షన్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి:War 2 : హృతిక్ రోషన్ ‘వార్ 2’ లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పాట్నాలోని మహిళా కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగినట్లు తెలిపారు. గురువారం ప్యాసింజర్ రైలులో ఈ మంటలు అంటుకున్నాయని చెప్పారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇతర బోగీలను దూరంగా నెట్టారని చెప్పుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షించారు.
తాజావార్తలు
-
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
-
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!