Vijayasai Reddy : ఐఐఎంలలో 60 శాతం బీసీ, ఎస్సీ కోటా పోస్టులు ఖాళీ.. భర్తీపై దృష్టి సారించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో వెనుకబడివ వర్గాలు, ఎస్సీలకు కేటాయించిన ఫ్యాకల్టీ పోస్టులలో 60 శాతం భర్తీ కాకుండా మిగిలిపోయాయని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించిన ఫ్యాకల్టీ పోస్టులలో 80 శాతం భర్తీ కాలేదని అన్నారు. ఐఐఎంల బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఐఐఎంలు అన్నింటిలో కలిపి మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 1500. అయితే 2023 మార్చి నాటికి వీటిలో భర్తీ చేయని పోస్టులు 500 వరకు ఉన్నాయని అన్నారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో సైతం బోధనా సిబ్బంది కొరత ఇలా ఉంటే విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించకోవచ్చని అన్నారు. ఐఐఎంలలో ఉన్నక ప్రమాణాలతో విద్యా బోధన జరగాలంటే తగినంత బోధనా సిబ్బంది ఉంటేనే సాధ్యపడుతుందని అన్నారు.
Also Read : Anushka Malhotra: చిరంజీవి రీల్ కూతురు ఏంట్రా.. ఇంత హాట్ గా ఉంది.. ?
Also Read
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
గడిచిన పదేళ్ళలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు ఐఐఎంలతో కలిపి దేశంలో ఐఐఎంల సంఖ్య 20కి చేరింది. అయితే వీటికి తగినంత బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ఐఐఎంల సంఖ్య పెరిగే కొద్దీ వాటికి ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ మద్దతు తగ్గుతూ వస్తోందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఐఎంలకు 654 కోట్ల రూపాయలు కేటాయించాలని బడ్జెట్లో అంచనా వేస్తే. సవరించిన అంచనాల తర్వాత కేటాయించింది 608 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో సగానికిపైగా కోత విధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఐఐఎంలకు తగినంత నిధులు కేటాయించి అవి మరింతగా రాణించేలా ప్రోత్సహించాలని ఆయన విద్యా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ విద్యా సంస్థలలో స్థానికతకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఐఐఎం ప్రవేశాలలో స్థానికుల కోటాను కూడా ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి కోరారు.
Also Read : ChatGPT : చాట్ జీపిటి లో బిగ్ చెంజెస్… వచ్చే వారం మరో కొత్త ఫీచర్స్..
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!