నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్ వండర్లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. ఏంటి అంటే..
Also Read : Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!
ఈ మూవీలో రావణుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్కు తమ్ముడు, విభీషణుడి పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని సమాచారం. అధర్మం వైపు నడిచే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే పోరాటంలో ఈ ఇద్దరు దిగ్గజ నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్గా నిలవనుంది. ఇక హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్జ్ జిమ్మెర్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తుండటం విశేషం.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రాముడు, సీత పాత్రల ఫస్ట్ లుక్ లేదా టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచస్థాయి విజువల్స్తో చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని మిగల్చనుంది.
Vijay Sethupathi is also part of the mega film #Ramayana. He plays “Vibhishanan” Role.💥
– VP pic.twitter.com/AnTUvHmBAY
— Christopher Kanagaraj (@Chrissuccess) February 5, 2026